సింగర్‌ సుశీలకు అస్వస్థత

లెజండరీ సింగర్, పద్మభూషన్ గ్రహీత పి. సుశీల అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. 86 ఏళ్ల వయసున్న సుశీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. సుశీల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అది సాధారణ కడుపునొప్పేనని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని తెలిపారు.

పద్మభూషణ్‌ గ్రహీత అయిన సుశీల.. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు సినీవినీలాకాశంలో ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించి సంగీత ప్రియులను ఉర్రూత లూగించారు. ఆమె తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా మొత్తం 9 భాషలలో 40 వేలకుపైగా పాటలు పాడారు. తన అద్భుత స్వరంతో అభిమానులను కట్టిపడేశారు. ఉష్రేష్ మన్మాన్ చిత్రంలోని ‘లైక్ పాల్’ అనే పాటకు ఆమె మొదటిసారిగా ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌గా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. కాగా, వయోభారంతో గత కొంతకాలంగా ఆమె పాటలు పాడడం మానేసి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.