ఆంజనేయులు అరెస్ట్: కీలక మలుపు తిప్పిన జెత్వానీ కేసు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక్కసారిగా కలిచేసిన ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులను ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం. పీఎస్సార్ ఆంజనేయుల అరెస్టు, గతంలో జరిగిన వివిధ వివాదాస్పద ఘటనలపై మళ్లీ దృష్టి మళ్లించింది. నటి జెత్వానీతో సంభంధించిన కేసుతో పాటు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన అనేక వివాదాస్పద చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు అప్పుడే వచ్చినా, ఇప్పుడవే విషయాలు వెలుగులోకి రావడం గమనార్హం.
రఘురామ స్పందన: “జగన్ కోసం కాల్చి వచ్చిన వ్యక్తి ఇతడు!”
ఈ అరెస్టుపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఉదయం టీవీలో ఈ వార్తను చూశానని, దాన్ని చూసి ఎంతో ఆనందించానని రఘురామ చెప్పారు. ఆయన ఆరోపణల ప్రకారం, పీఎస్సార్ ఆంజనేయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అనేక అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. “జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చిన వ్యక్తి ఇతడు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తనపై జరిగిన దాడి కేసులో కూడా పీఎస్సార్ ఆంజనేయులు కీలక పాత్ర పోషించారని స్పష్టం చేశారు.
తనపై దాడిలో ఐపీఎస్ అధికారుల పాత్రపై రఘురామ ఆరోపణలు
రఘురామ పేర్కొనడం ప్రకారం, తనపై జరిగిన దాడి కేసులో పీఎస్సార్ ఆంజనేయులు ఏ2 నిందితుడిగా ఉన్నారు. ఈ అరెస్టుతో తన కేసు కూడా త్వరితగతిన ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే కేసులో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పాత్ర ఉందని, ఆయనను కూడా త్వరలో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటివరకు సునీల్ కుమార్ను కనీసం విచారణకు కూడా పిలవలేదని రఘురామ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కేసు విచారణ రోడ్డు రోలర్ వేగంతో నడుస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన రఘురామ, విచారణ ఒకసారి వేగం పుంజుకుంటే ఆగదని తన విశ్వాసం వ్యక్తం చేశారు.
సుమోటో కేసు, వైద్య నివేదికల గందరగోళం
రఘురామ కృష్ణంరాజు వెల్లడించిన వివరాల ప్రకారం, తనపై సుమోటో కేసు నమోదు చేసిన సునీల్ నాయక్ అనే వ్యక్తి బీహార్ నుంచి రావడానికి నిరాకరిస్తున్నాడని తెలిపారు. దీనితో పాటు, తనపై జరిగిన దాడి కేసులో వైద్య నివేదికలను తారుమారు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ను ఇప్పటికే విచారిస్తున్నట్లు చెప్పారు. ఈ పరిణామాలతో తన కేసు మరోసారి గట్టిగా ముందుకు కదిలే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద పీఎస్సార్ ఆంజనేయుల అరెస్టుతో కాదంబరి జెత్వానీ కేసు, రఘురామపై దాడి కేసు తదితర వివాదాస్పద ఘటనల్లో నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
READ ALSO: Raghurama: జెత్వానీ కేసులో ఉన్న స్పీడ్ నా కేసులో ఉండాలి:రఘురామ