ఆన్లైన్ బెట్టింగ్ ఈ మధ్యకాలంలో ఎంతో మందిని కబళిస్తున్న ఒక ప్రమాదకర వ్యసనం. ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్లు వేగంగా ప్రాచుర్యం పొందాయి. ఈ యాప్స్ తొలుత ఆకర్షణీయమైన ఆఫర్లు, బోనస్లతో వినియోగదారులను తమ వలలోకి దింపుకుంటాయి. చిన్న మొత్తాలతో ప్రారంభించిన వారు, కొద్దిసార్లు గెలిస్తే మరింత ఆశపడి భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తారు. కానీ, అనూహ్యంగా ఓటమి చెందుతారు. అప్పుడు ఆ నష్టాన్ని తిరిగి పూరించుకోవాలని అప్పులు చేసి మరీ బెట్టింగ్ కొనసాగిస్తారు.ఒక్కోసారి లక్షల రూపాయలు పోగొట్టుకుని తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతారు. పైగా అప్పులు చేసినవాళ్లు వడ్డీ దారులు వేధిస్తే, ఆత్మహత్యలు చేసుకునే స్థితికి చేరిపోతున్నారు. ముఖ్యంగా యువత ఈ బెట్టింగ్ మాయాజాలంలో చిక్కుకొని భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు బహిరంగంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇస్తూ, అమాయకుల్ని మోసగిస్తున్నాయి.ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఈ బెట్టింగ్ మూలాలు మాత్రం అంతుచిక్కడంలేదు. ఈ బ్లాక్ మార్కెట్ వ్యాపారం ఎన్నో కుటుంబాలను తలకిందులు చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఆన్లైన్ బెట్టింగ్ మాయాజాలంలో పడకుండా జాగ్రత్తపడాలి. చిన్న నష్టమే పెద్ద బాదలు తెచ్చిపెట్టొచ్చు. ఒక్కోసారి, తిరిగి లేని నష్టానికి కారణమవచ్చు. కాబట్టి, ఆన్లైన్ బెట్టింగ్కు దూరంగా ఉండటం మంచిది.

ఒకరి పేరు మీద మరొకరు అప్పుల మీద అప్పులు చేసి,ఆ డబ్బునంతా ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టి, ఉన్నదంతా కోల్పోయిన ఆ ముగ్గురు అవి తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. హాంచా గ్రామనికి చెందిన జోశి ఆంథోనీ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన పేరు, తన సోదరి పేరు చెప్పి,సోదరుడు జోబి ఆంథోనీ, మరదలు షర్మిల ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేశారని.రూ.80 లక్షల దాకా అప్పులు పేరుకుపోయాయని.. దీనికి రోజుకు రూ.2.5 లక్షల వడ్డీ కట్టాల్సి వస్తోందని అంతకుముందు సెల్ఫీ వీడియోలో ఆయన వాపోయాడు. ఈ వీడియో బయటికి రావడంతో జోబి ఆంథోనీ, ఆయన భార్య షర్మిల విజయనగరంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై మైసూరు, విజయనగరంలో కేసులు నమోదయ్యాయి.
ఆన్లైన్ బెట్టింగ్
సాంకేతిక పురోగతితో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు విస్తృతంగా విపరీతంగా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. చిన్న మొత్తాలతో మొదలైన వారు పెద్ద మొత్తాలు పోగొట్టుకొని అప్పుల్లో కూరుకుపోతున్నారు. దీంతో వారు తనువు చాలించే స్థితికి చేరుకుంటున్నారు. దీంతో ప్రభుత్వాలు, పోలీసులు, సామాజిక సంస్థలు వీటిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.