మరోసారి వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం

Once again stone pelting on Vande Bharat train.. Glass of three coaches were destroyed

ఛత్తీస్‌గఢ్‌ఫ: ఛత్తీస్‌గఢ్‌ వందేభారత్ రైలు ట్రయల్ రన్ జరుగుతుండగా రాళ్లు విసిరిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ – ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం మధ్య నడవనున్న ఈ రైలు శుక్రవారం ఉదయం విశాఖపట్టణం నుంచి వస్తుండగా బగ్‌బహరా రైల్వే స్టేషన్ వద్ద నిందితులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ రైలుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కానప్పటికీ సీ2-10, సీ4-1, సీ9-78 కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి. నిందితులు శివకుమార్ బఘేల్, దేవేంద్ర కుమార్, జీతు పాండే, సన్వానీ, అరుణ్ యాదవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ రైలుతోపాటు దేశంలోని తొలి వందేభారత్ మెట్రో రైలును కూడా మోడీ ప్రారంభించనున్నారు. ఇది గుజరాత్‌లోని భుజ్ నుంచి అహ్మదాబాద్‌ మధ్య నడవనుంది. అలాగే, 20 కోచ్‌లతో వారణాసి-ఢిల్లీ మధ్య పరుగులు పెట్టనున్న తొలి 20 కోచ్‌ల వందేభారత్ రైలును కూడా మోడీ నేడు ప్రారంభిస్తారు. అలాగే, టాటానగర్-పాట్నా, నాగ్‌పూర్-సికింద్రాబాద్, కొల్హాపూర్-పూణె, ఆగ్రా కంటోన్మెంట్-బెనారస్, పూణె-హుబ్బళ్లి మధ్య నడిచే వందేభారత్ రైళ్లను మోడీ ప్రారంభిస్తారు.