IPL 2025: మరోసారి ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలు !

IPL 2025: మరోసారి ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలు !

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా, ఫ్రాంచైజీలు క్రికెట్ అసోసియేషన్స్ మధ్య వార్ కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ల మధ్య గొడవ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కాంప్లిమెంటరీ పాస్‌ల కోసం హెచ్‌సీఏ బ్లాక్ మెయిల్ చేస్తుందని, హైదరాబాద్‌ను వీడుతామని సన్‌రైజర్స్ హైదరాబాద్ మెయిల్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. చివరకు హెచ్‌సీఏ తలొగ్గి చర్చలు జరపడంతో గొడవ సద్దుమణిగింది.

Advertisements

తొమ్మిది పరుగుల

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌) జ‌ట్టు అనుకున్న స్థాయిలో రాణించ‌లేక‌పోతోంది. ఆ జట్టు ప్రస్తుతం రెండు విజయాలు, ఐదు పరాజయాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక‌, గెలుపు ముంగిట బోల్తా ప‌డ‌డం అభిమానుల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. గ‌త రెండు మ్యాచుల్లో ఇదే జ‌రిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్‌లో కేవలం తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. ఆ త‌ర్వాత‌ సూపర్ ఓవర్‌లో మ్యాచ్‌ను కోల్పోయింది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్‌సీఏ), రాజస్థాన్ రాయల్స్ జట్టు మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫిక్సింగ్‌కు పాల్పడిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్‌సీఏ) అడ్‌హక్ కమిటీ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే జైదీప్ బిహానీ ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడంపై జైదీప్ సందేహాలు వ్యక్తం చేశారు.హోమ్ గ్రౌండ్‌లో విజయం ఖాయమనుకున్న దశలో ఎలా ఓడిపోయిందంటూ ప్రశ్నించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

 IPL 2025: మరోసారి ఐపీఎల్ లో  ఫిక్సింగ్ ఆరోపణలు !

రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ ఆర్‌సీఏకు విలువ ఇవ్వడం లేదని, పూర్తిగా పక్కనపెట్టిందని ఆరోపించారు. ‘రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం అడ్‌హక్ కమిటీని నియమించింది. ఈ కమిటీని ఐదోసారి పొడిగించింది. ఆర్‌సీఏ ఆధ్వర్యంలో జరిగే అన్ని మ్యాచ్‌లు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహిస్తున్నాం. కానీ ఐపీఎల్ వచ్చే సరికి జిల్లా పరిషత్ బాధ్యతలు తీసుకుంటుంది.ఐపీఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ ఆర్‌సీఏకు మాత్రమే లేఖ పంపింది. కానీ సవాయి మాన్సింగ్ స్టేడియం నుంచి మాకు ఎంఓయూ లేదని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ సాకు చెబుతోంది.ఎంఓయూ లేకపోతేనేం ప్రతీ మ్యాచ్‌కు జిల్లా పరిషత్‌కు రెంట్ చెల్లిస్తున్నారు? కదా?’అని జైదీప్ ప్రశ్నించారు. ప్రస్తుతం జైదీప్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఫిక్సింగ్ ఉదంతం నేపథ్యంలోనే గతంలో రాజస్థాన్ రాయల్స్‌పై రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Read Also: IPL 2025: కోల్‌కతాపై గుజరాత్‌ టైటాన్స్‌ ఘన విజయం

Related Posts
Maoists : మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ
Maoists మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ

Maoists : మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన సంఘటనలు ఇందుకు నిదర్శనం. మార్చి 29న సుక్మా, Read more

IPL 2025 : ఈరోజైనా SRH ‘300′ కొడతారా?
SRH vizag

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఘనత సాధించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో వారి బ్యాటింగ్ సత్తా మరోసారి పరీక్షించుకోనుంది. గత మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయినా, ఈ Read more

AI-Based Data Center : దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్
AI Based Data Center chhatt

భారతదేశంలో డిజిటల్ రంగంలో మరో గొప్ప అడుగు పడింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని నవరాయ్‌పూర్‌లో దేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డేటా సెంటర్ పార్క్‌కు ముఖ్యమంత్రి Read more

మహాకుంభ్ మృతుల లెక్కలు దాచిపెడుతున్నారు: అఖిలేష్ యాదవ్
akhilesh yadav

మహాకుంభ్ మేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల లెక్కలను దాచిపెడుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. తొక్కిసలాటలో Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×