Once again, a plane flies over Srivari Temple.. TTD is angry!

Tirumala: మరోసారి శ్రీవారి ఆలయంపై నుంచి విమానం.. టీటీడీ ఆగ్రహం !

Tirumala: మరోసారి తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం వెళ్లింది. దీంతో టీటీడీ తీవ్రంగా మండిపడింది. ఇప్పటికే పలుమార్లు కేంద్ర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితమే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు టీటీడీ అధికారులు చెప్పుకొచ్చారు. అయినా తమ విజ్ఞప్తిని కేంద్ర విమానయాన సంస్థ పట్టించుకోవటం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.

Advertisements

గతంతో పోలిస్తే ఇవాళ గోపురం సమీపంపై నుంచే విమానం

అయితే, ఆగమశాస్త్ర నిభందనల ప్రకారం శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమాన రాకపోకలు లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సైతం టీటీడీ అధికారులు కోరారు. ఇవాళ కూడా శ్రీవారి ఆలయ గోపురంపై నుంచే విమానం వెళ్లింది. గతంతో పోలిస్తే ఇవాళ గోపురం సమీపంపై నుంచే విమానం వెళ్లింది. దీంతో విమానయాన శాఖ వైఖరిపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర పౌర విమానయాన మంత్రి తిరుమలను నో-ఫ్లై జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మరోసారి శ్రీవారి ఆలయంపై నుంచి

ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా

కూటమిలో చంద్రబాబు ఉన్నప్పటికీ దీనిపై గట్టిగా కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని కొంత మంది భక్తులు నిలదీస్తున్నారు. ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. కాగా, హోంమంత్రి అనిత ఈ అంశంపై స్పందించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశం వచ్చిందని దీనిపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు. నివేదికలు వచ్చిన వెంటనే కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి శ్రీవారి ఆలయం పైనుంచి విమానాల రాకపోకలు జరుగకుండా చూస్తామని తెలిపారు.

Related Posts
శ్వేత వర్ణంలో జమ్ముకశ్మీర్‌
Snowfall Blankets Jammu and Kashmir, Transforming Tourist

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో మంచు వర్షం కురుస్తోంది. బారాముల్లా, సోనమార్గ్‌, బందిపోర సహా అనేక ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర Read more

పెళ్లి తర్వాత శోభిత సినిమాల్లో నటిస్తుందా..? చైతు ఏమన్నాడంటే..!!
chaitu weding date

టాలీవుడ్ నటుడు నాగచైతన్య, నటి శోభిత మరికొద్ది గంటల్లో ఒకటి కాబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియో లో రేపు (డిసెంబర్ 04) వీరి వివాహం అట్టహాసంగా జరగబోతుంది. ఈ Read more

Rahul Gandhi : సుంకాలపై ప్రభుత్వం స్పందించాలని రాహుల్ గాంధీ డిమాండ్
Rahul Gandhi సుంకాలపై ప్రభుత్వం స్పందించాలని రాహుల్ గాంధీ డిమాండ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో డిమాండ్ చేశారు."అమెరికా సుంకాలు మన Read more

భారత ఆర్ధికవృద్ధిపై ప్రశంసలు కురిపించిన అధ్యక్షుడు పుతిన్‌
President Putin praised Indias economic growth

న్యూఢిల్లీ: రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ఆర్థిక Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×