మరో మూడు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లోకి ‘జగనన్న తోడు’ జమ

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారు..ఇప్పటికే జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మఒడి, విద్యాకానుక , వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం తో పాటు జగనన్న తోడు పేరుతో ఓ పథకం తీసుకొచ్చారు. ఈ పథకం కింద అర్హత కలిగిన చిరు వ్యాపారులకు రూ.10 వేలు రుణం లభిస్తుంది. అధిక వడ్డీ భారం నుంచి చిరు వ్యాపారులను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, చేతి వృత్తులు చేసుకునే వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ చేయనున్నారు.

ఈ నెల 26 న అంటే మరో 5 రోజులలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించిన కసరత్తు జరగుతోంది. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది ఏపీ ప్రభుత్వం..గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిన అనంతరం మండల స్థాయి అధికారులకు ఆ తర్వాత జిల్లా కలెక్టర్లకు చేరుతోంది. లబ్ధిదారుల ఎంపిక అనంతరం జాబితా గ్రామ సచివాలయాల్లో చూపిస్తారు. ఈ పథకం కింద రుణం పొందిన వారు నెలసరివాయిదాల్లో నగదును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తైంది. ఈ ఏడాది మొదట్లో ఈ పథకం కోసం వివరాలు సేకరించినా పథకం అమలు ఆలస్యమైంది.