Omar Abdullah sworn in as Jammu and Kashmir CM

జమ్మూకశ్మీర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేయించారు. ఒమర్ అబ్దుల్లాతోపాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా సురేంద్ర చౌదరి ప్రమాణ స్వీకారం చేయగా.. జావేద్ దార్, సకినా ఇట్టు, జావేద్ రానా, సతీష్ శర్మలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో భారత కూటమి నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సుప్రియా సూలె, అఖిలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారానికి ముందు మీడియాతో మాట్లాడిన ఒమర్ అబ్దుల్లా .. కొత్తగా ఏర్పాటవుతున్న తమ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. జమ్ము కశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేశాక.. ప్రమాణ స్వీకారం చేస్తున్న తొలి ముఖ్యమంత్రిని తానేనన్నారు. గడిచిన పదేళ్లలో జమ్ము కశ్మీర్ ప్రజలు చాలా కష్టాలను ఎదుర్కొన్నారని, తమ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు.

కాగా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 29, కాంగ్రెస్ కు 6, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 3, పీపుల్ కాన్ఫరెన్స్ కు 1, సీపీఐ(ఎం) 1 స్థానాల్లో గెలిచాయి. కాగా.. జమ్ము కశ్మీర్ ను కేంద్రంలో ఉన్న బీజేపీ 2019, ఆగస్టు 5న కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. జమ్ము కశ్మీర్, లడఖ్ గా విభజించి రాష్ట్రపతి పాలన విధించింది. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల జరిగిన జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 స్థానాల్లో విజయం సాధించగా.. నలుగురు స్వతంత్రులు, ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Related Posts
బడే చొక్కారావు బతికే ఉన్నాడా..?
maoist bade chokka rao

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై మావోయిస్టు పార్టీ Read more

సీడబ్ల్యూసీ చైర్మన్‌ గా ముకేశ్‌ కుమార్‌ సిన్హా
Mukesh Kumar Sinha as the Chairman of CWC

న్యూఢిల్లీ: సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ చైర్మన్‌గా ముకేశ్‌ కుమార్‌ సిన్హాను కేంద్ర ప్రభుత్వం నియమించిది. ఈ మేరకు డీవోపీటీ అండర్‌ సెక్రటరీ కుందన్‌ నాథ్‌ ఉత్తర్వులు జారీ Read more

ప్రియాంక గాంధీ వాయనాడ్ లో 3.6 లక్షల ఓట్ల ఆధిక్యం
PRIYANKA GANDHI scaled

2024 లోక్‌సభ బైపోల్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాయనాడ్ నియోజకవర్గంలో విశేష ఆధిక్యం సాధించారు. ప్రస్తుత ట్రెండ్‌ల ప్రకారం, ప్రియాంక గాంధీ 3.6 లక్షల ఓట్ల ఆధిక్యంతో Read more

తెలంగాణకు తీరప్రాంతం లేని లోటును పూడ్చుతాం – సీఎం రేవంత్
cm revanth davos

తెలంగాణ రాష్ట్రానికి తీరప్రాంతం లేకపోవడంతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు మచిలీపట్నం పోర్టును ప్రత్యేక రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *