జమ్మూ కశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని షాక్కు గురి చేసింది. టూరిస్టులపై ఉగ్రవాదులు చెలరేగి దాడి చేయడంతో తీవ్ర విషాదం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఈ దాడిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తూ మొత్తం 26 మంది మృతిచెందినట్లు వెల్లడించింది. వీరిలో 25 మంది భారతీయులు కాగా, ఒకరు నేపాల్ దేశస్థుడిగా గుర్తించారు. ఈ ఘటన దేశాన్ని తీవ్రంగా కుదిపేసింది.
మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రగాఢ సానుభూతి
గాయపడిన బాధితుల చికిత్స కోసం అన్ని అవసరమైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకునేలా వైద్య బృందాలు కృషి చేస్తున్నాయని పేర్కొంది. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. వారి కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన సహాయాన్ని అందించనున్నట్లు హామీ ఇచ్చింది.
పాక్ పై భారత్ ప్రతీకారం
ఈ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకారం, అనేక దేశాలు ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించి, భారత్కు మద్దతుగా నిలిచాయి. ఉగ్రవాదానికి ఏ రూపంలోనూ చోటులేదని స్పష్టంగా వెల్లడించాయి. భారత్ కూడా ఈ దాడికి తగిన ప్రతీకారం తీసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.