పిఠాపురంలో ఇద్దరు ఆఫీసర్ల బాహాబాహి..

పిఠాపురం నియోజకవర్గంలో ఓ ఇద్దరు అధికారులు బాహాబాహికి దిగారు. పవన్ కల్యాణ్ నియోజకవర్గం కావడంతో ఈ వ్యవహారం వైరల్​గా మారింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు విషయంలో ఇద్దరు అధికారులు గొడవపడ్డారు.

పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. మున్సిపల్ కమిషనర్ కనకారావు, డిఈ భవాని శంకర్‌ల మధ్య వివాదం జరిగింది. అది కాస్త వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది. దీంతో ఇద్దరు కొట్టుకున్నారు. కౌన్సిల్ సభ్యులు ఉన్నారని కూడా చూడకుండా.. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఉన్నత స్థానంలో ఉన్న కమిషనర్ కనకరావు, డీఈ భవాని శంకర్ బహిరంగంగా కొట్టుకోవడంతో ఈ రచ్చ తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం ఆఫీసర్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని చర్చ జరుగుతోంది.