కాసేపట్లో చంద్రబాబు తో ఎన్టీఆర్ భేటీ

ఏపీ సీఎం చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ మరికాసేపట్లో భేటీ కానున్నారు. విజయవాడ వరద బాధితులకు ప్రకటించిన రూ.50లక్షల విరాళాన్ని నేరుగా అమరావతిలో సీఎంను కలిసి అందజేయనున్నారు. అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు దాతలు స్వచ్చందగా ముందుకొస్తున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పలువురు విరాళాలు అందజేశారు. చిత్రసీమ నుండి కూడా పెద్ద ఎత్తున ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారు. నిన్న నందమూరి బాలకృష్ణ , డీజే టిల్లు ఫేమ్ సిద్దు , విశ్వక్ సేన్ లు స్వయంగా చంద్రబాబు ను కలిసి తమ విరాళాలు అందజేయగా..ఈరోజు జూ ఎన్టీఆర్ ..రూ.50 లక్షల చెక్ ను చంద్రబాబు కు అందజేయబోతున్నారు.

నిన్న రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధి నారాయణ రెడ్డి రూ. 5 కోట్ల చెక్కు, ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్ తరఫున పెండ్యాల అచ్యుత రామయ్య రూ. 2 కోట్లు , విక్రం నారాయణ రావు కుటుంబ సభ్యులు కోటి 55 లక్షలు, వసుధా ఫార్మా తరఫున వెంకటరామరాజు కోటి, ఏఎంఆర్​ గ్రూప్ (AMR Group) తరఫున మహేశ్వరరెడ్డి మరో కోటి రూపాయల చెక్కు ఇచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అక్కినేని వెంకట్‌, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, క్రెడాయ్ తరఫున వైవీ రామారావు రూ. 50 లక్షల చెక్కులను సీఎంను కలిసి అందించారు. పత్తికొండ నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్యే కెఈ శ్యామ్‌బాబు రూ 2.30 కోట్లు చెక్కు అందజేశారు.