తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం ప్రకటించిన జూ.ఎన్టీఆర్

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఎటు చూసినా వరద నీరే కనిపించడంతో ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. భారీ పంట నష్టం, ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కూడా సంభ‌వించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు జూ ఎన్టీఆర్ తన వంతు సాయం ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాలకు సీఎంల సహాయనిధికి రూ.50 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోని వరద బీభత్సం కలిచి వేసిందని, అతిత్వరగా తెలుగు ప్రజలు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని , తెలుగు ప్రభుత్వాలకు సహాయపడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తతం ఎన్టీఆర్ గత మూడు రోజులుగా ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ‘కాంతార’ నటుడు రిషబ్ శెట్టి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి పురాతన ఆలయాలను సందర్శిస్తున్నారు. తాజాగా రిశబ్ శెట్టి స్వగ్రామానికి సమీపంలోని సుప్రసిద్ధ కేశవనాథేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. రిషబ్ శెట్టి సతీమణి ప్రగతి శెట్టి, ప్రశాంత్ నీల్ భార్య లిఖిత, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతీ సైతం గుహలో కొలువై ఉన్నకేశవనాథేశ్వరుడిని దర్శనం చేసుకున్నారు. అక్కడి సహజ సిద్ధమైన అందాలు చూసి ఎన్టీఆర్ పులకించిపోయారు. అటవీ ప్రాంతలో ఉన్న అద్భుత ఆలయాన్ని చూసి మైమరిపోయారు.