మీ భర్త ఎవరో చెప్పాలంటూ శాంతి కి నోటీసులు

ఏపీలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి – దేవదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ప్రభుత్వ ప్లీడర్ సుభాష్ వల్ల తన భార్య గర్భం దాల్చిందంటూ దేవాదాయ శాఖ మహిళా అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి పై భర్త మదన్ మోహన్ కీలక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో విజయసాయి రెడ్డి, శాంతి లు మదన్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. అయితే ఇక ఇప్పుడు శాంతి కి మరో షాక్ తగిలింది. దేవాదాయ శాఖ తాజాగా శాంతి కి నోటీసు లు పంపారు.

నోటీస్ లో దేవాదాయశాఖలో 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె.మదన్ మోహన్ అని పేర్కొన్నారు. సర్వీస్ రిజిస్టర్ లో అదే నమోదు చేయించారు. గత ఏడాది జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు భర్త పేరు మదన్ మోహన్ అని పేర్కొన్నారు. కానీ ఈ నెల 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో పి.సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. దీనిపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ సస్పెన్షన్ లో ఉన్న సహాయ కమిషనర్ కె.శాంతికి ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణ తాఖీదు జారీ చేశారు.