కొత్త పింఛన్లఫై మంత్రి సీతక్క తీపి కబురు

కొత్త పింఛన్లఫై మంత్రి సీతక్క తీపి కబురు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్ తెలిపింది. కానీ అధికారంలోకి వచ్చాక ఆరు నెలలు అవుతున్న ఇంతవరకు పింఛన్లు పెంచలేదని , కొత్త పింఛన్లకు సంబంధించి ఊసే లేదని వాపోతుండగా..మంత్రి సీతక్క తీపి కబురు తెలిపి వారింది శాంతింపజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా అర్హుల లిస్ట్ రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో సూచించారు. అలాగే చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. తెలంగాణలో వృద్ధులతో పాటు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత, స్టోన్ కట్టర్లు, ఫైలేరియా రోగులు, డయాలసిస్‌ రోగులు, ఎయిడ్స్‌ రోగులకు పెన్షన్ ఇస్తున్నారు. ఆసరా పెన్షన్‌ రూ.2016, దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.3016గా అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని చేయూత పథకం కింద వికలాంగులకు రూ.6వేలు, మిగిలిన వారికి రూ.4వేలు అందిస్తామని కాంగ్రెస్ ముందే చెప్పింది. ఇప్పుడు పెన్షన్ల పెంపు కోసం ఆదేశాలను జారీ చేశారు మంత్రి సీతక్క. నివేదికలు సిద్ధం చేసిన తర్వాత ప్రభుత్వం లిస్ట్‌ను పరిశీలించి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.