ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేషనల్ డిజాస్టర్ రిస్పాన్స్ ఫోర్స్ (NDRF) 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా క్లిష్ట సమయాల్లో NDRF అందించే సేవలు ఎంత ముఖ్యమైనవో, విజయవాడ వరదల సమయంలో ఈ సేవల ప్రత్యేకంగా చూసినట్లు గుర్తు చేసారు. విజయవాడలో జరిగిన వరదలను ఎదుర్కొనేందుకు NDRF చేసిన కృషి అనూహ్యమని , అభినందనీయమని ప్రేకొన్నారు.
తమ ప్రభుత్వం లో NIDM, NDRF క్యాంపస్ కు 50 ఎకరాలు భూమి కేటాయించి, శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ క్యాంపుల ప్రారంభం అమిత్ షా చేతుల మీదుగా జరగడం గొప్ప విషయమని బాబు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.