📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Indians Evacuated: గల్ఫ్ దేశాల నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు

Author Icon By Saritha
Updated: March 12, 2026 • 12:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Indians Evacuated: పశ్చిమాసియాలో యుద్ధం పరాకాష్టకు చేరుతున్న వేళ భారత ప్రభుత్వం తన పౌరుల రక్షణ కోసం కీలక అడుగులు వేస్తోంది. బుధవారం ఒక్కరోజే లెబనాన్, ఖతార్ దేశాల నుంచి సుమారు 700 మందికి పైగా భారతీయులు క్షేమంగా సొంత గడ్డపై చేరుకున్నారు.

లెబనాన్ రాజధాని బీరూట్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో.. అక్కడ చిక్కుకున్న 177 మంది భారతీయ పౌరులను ఒక ప్రత్యేక చార్టర్ విమానం ద్వారా ఢిల్లీకి తరలించారు. వీరిని వారి యాజమాన్యం ఏర్పాటు చేసిన విమానంలో స్వదేశానికి పంపగా.. బీరూట్ విమానాశ్రయంలో భారత రాయబారి నూర్ రెహమాన్ షేక్ స్వయంగా వీరికి వీడ్కోలు పలికారు. లెబనాన్‌లోని భారతీయులకు అన్ని విధాలా అండగా ఉంటామని రాయబార కార్యాలయం ప్రకటించింది.

Read Also: Loksabha: లావు వ్యాఖ్యలతో లోక్ సభలో తీవ్ర దుమారం

Indians Evacuated: Indians safely return home from Gulf countries

ఖతార్ నుండి 500 మందికి పైగా స్వదేశానికి..

ఖతార్‌లో చిక్కుకున్న సుమారు 500 మంది భారతీయులు బుధవారం ఖతార్ ఎయిర్‌వేస్ విమానాల ద్వారా ఢిల్లీ, ముంబైలకు చేరుకున్నారు.ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మార్చి 12వ తేదీన మరిన్ని అదనపు విమానాలను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. రాయబార కార్యాలయం 24/7 హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కేవలం ఒకటి రెండు రోజుల్లోనే ‘తత్కాల్’ పాస్‌పోర్టులను జారీ చేస్తూ సేవలు అందిస్తోంది. ముఖ్యంగా ఖతార్ నుంచి వీరిని రోడ్డు మార్గం ద్వారా సౌదీకి తరలించి అక్కడి నుంచి భారత్‌కు విమానాల్లో తరలిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Indian evacuation Lebanon Indians coming back from Qatar Middle East Tension West Asia War

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.