అమరావతి రాజధాని నిర్మాణానికి తిరిగి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించింది. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి విచ్చేసి రాజధాని పనుల పునఃప్రారంభానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా అలెర్ట్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మళ్లీ అభివృద్ధి పటాకా ఎగురవేయడానికి మార్గం సిద్ధమవుతోంది.

ప్రధాని పర్యటనకు ముస్తాబవుతున్న అమరావతి
ఈ మేరకు మే 2న ప్రధాని మోడీ అమరావతి రాజధాని పనుల తిరిగి ప్రారంభానికి రాబోతున్నారు. ఈ సభకు 5 లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీటికి సంబంధించిన ఏర్పాట్ల కోసం ఓ మంత్రివర్గ కమిటీనే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షేత్రస్దాయిలో ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. చరిత్రలో గుర్తుండిపోయేలా మోదీ పర్యటనను నిలపాలనే దృష్టితో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు వేదిక ప్రాంతాన్ని పరిశీలించి, పూర్తి ప్రణాళికను రూపొందించారు. ప్రధాని పర్యటనకు సుమారు 90 శాతం ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి నారాయణ ప్రకటించారు. ప్రధాని పర్యటన వేదిక వద్దకు వెళ్లేందుకు అవసరమైన 8 రహదారులను ఇప్పటికే గుర్తించారు. వీటితో పాటు 11 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటవుతున్నాయి. 58 రోజుల వ్యవధిలోనే 34,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులు ఇచ్చారని మంత్రి నారాయణ గుర్తుచేశారు. ఈ రైతుల త్యాగాన్ని గుర్తించి, మోదీ సభలో వారిని ప్రత్యేకంగా గౌరవించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలను ఆయన వెల్లడించారు. ఇది కేవలం అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాక, రైతుల భాగస్వామ్యానికి గుర్తింపుగా మారనుంది.
అమరావతి నిర్మాణంలో అంతర్జాతీయ దృక్పథం
హైదరాబాద్లో ఒక ఎయిర్పోర్ట్ ఉండగా కూడా శంషాబాద్లో మరోదాన్ని నిర్మించాం. అదే తత్వంతో, భవిష్యత్ 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని అమరావతిని నిర్మిస్తున్నాం, అని నారాయణ స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోతే స్మార్ట్ ఇండస్ట్రీలు రావు. ప్రజలు లేకపోతే భూముల విలువ పడిపోతుంది. అందుకే అన్ని కోణాల్లో అభివృద్ధికి దారితీయాలి, అన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటేనే స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తాయని నారాయణ తెలిపారు.
Read also: AP Tourism Bus : ఏపీ టూరిజం బస్సులో మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణ