Narendra Modi: సభా వేదికపైకి వచ్చిన మోదీ, చంద్రబాబు

Narendra Modi: సభా వేదికపైకి వచ్చిన మోదీ, చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ 2025 మే 2న రాష్ట్ర పర్యటన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం”లో పాల్గొనేందుకు మోదీ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు.

Advertisements

ఘన స్వాగతం:

హెలిప్యాడ్ వద్ద ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరంతా సభాస్థలికి బయల్దేరారు. ముందుగా గవర్నర్ మరియు పవన్ కల్యాణ్ వేదికపైకి వచ్చారు. అనంతరం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వేదికపైకి చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ధర్మవరంలోని చేనేత కళాకారులు ప్రత్యేకంగా తయారు చేసిన పట్టు శాలువా కప్పారు. కలంకారీ కళాకారులు తయారు చేసిన మోదీ చిత్రపటాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి ప్రధానికి బహుకరించారు. ప్రధాని మోదీతో పాటు సభావేదికపై రాష్ట్ర గవర్నర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, పి.నారాయణ, నాదెండ్ల మనోహర్ కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం నారా లోకేశ్ ప్రసంగిస్తున్నారు.

Read also: Nara Lokesh: మోదీ సభలో ఉద్వేగపూరితంగా మాట్లాడిన నారా లోకేశ్

Related Posts
మటన్ హలీమ్ కి ఫుల్ డిమాండ్
మటన్ హలీమ్ కి ఫుల్ డిమాండ్.

హైదరాబాద్‌లో రంజాన్ పండుగ సందర్భంగా హలీంకు డిమాండ్ పెరుగుదల రంజాన్ పండుగ అనేది ముస్లిం సామాజిక జీవితం లో ఎంతో ముఖ్యమైన పండుగ. ఈ సందర్భంగా హలీం Read more

Karunakar Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్‌పై తిరుప‌తి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు
Karunakar Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్‌పై తిరుప‌తి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు

భూమనపై తిరుపతి పోలీసుల కేసు నమోదు – టీటీడీ గోశాలపై తప్పుడు వ్యాఖ్యల ఆరోపణ తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) మాజీ ఛైర్మన్‌ మరియు వైఎస్సార్ కాంగ్రెస్ Read more

ChandrababuNaidu : సీఎం చంద్రబాబు తో యువ మేధావి సిద్ధార్థ్ భేటీ
ChandrababuNaidu : సీఎం చంద్రబాబు తో యువ మేధావి సిద్ధార్థ్ భేటీ

ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన ఏఐ-సర్టిఫైడ్ ప్రొఫెషనల్, భారత సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు. కేవలం ఏడు Read more

Nimmala Ramanaidu: మరోసారి జగన్ పై విరుచుకుపడ్డ మంత్రి నిమ్మల
Nimmala Ramanaidu: మరోసారి జగన్ పై విరుచుకుపడ్డ మంత్రి నిమ్మల

వైసీపీ ప్రభుత్వంపై నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు ఏపీ రాష్ట్రం లోని ఇరిగేషన్ రంగం గురించి గత కొద్దీ కాలంగా జరుగుతున్న చర్చలు, సమీక్షలు మరింత ప్రాధాన్యత Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×