Narendra Modi: మోదీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఘన స్వాగతం

Narendra Modi: మోదీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమారావతి పనుల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. రాజధాని నిర్మాణానికి మళ్లీ శుభారంభం ఏర్పడింది. ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరై శంకుస్థాపనలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా కేరళలోని తిరువనంతపురంలో జరిగిన అధికారిక కార్యక్రమాన్ని ముగించుకొని, అక్కడి నుంచి నేరుగా విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, పలువురు మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లో రాజధాని ప్రాంతంలోని వెలగపూడికి చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ ఘన స్వాగతం పలికారు. ప్రధానిని వీరు సభాస్థలికి తీసుకెళ్లారు. 

Advertisements

వెలగపూడిలో ప్రధాని పర్యటన

సాంప్రదాయ బద్ధంగా పూర్ణకుంభంతో, వేద మంత్రోచ్ఛారణలతో మహా గౌరవంతో ప్రధాని ని ఆహ్వానించారు. కాసేట్లో ప్రధాని రాజధాని అమరావతి పనులతో పాటు, 18 ప్రాజెక్ట్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సభాస్థలి ఇప్పటికే లక్షలాది మందితో కిటకిటలాడుతోంది. సభకు పెద్ద సంఖ్యలో అమరావతి రైతులు హాజరయ్యారు. తమ కల సాకారమవుతోందని వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు.

Read also: Modi: అమరావతి మోదీ సభకు తరలివచ్చిన ప్రముఖులు

Related Posts
మహిళపై చిరుత దాడి
Leopard attack on woman

ఆదిలాబాద్‌ జిల్లాలో చిరుతపులి భయం వీడడం లేదు. తాజాగా బజార్హాత్నూర్ మండలంలో చిరుతపులి దాడి జరిగింది. ఓ మహిళపై చిరుత దాడి చేయడంతో ఆమె ముఖానికి తీవ్ర Read more

నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు
నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు

ఏపీ ప్రభుత్వం ఢిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి సిద్ధమవుతూ, "రీడెవలప్మెంట్ ఆఫ్ ఏపీ భవన్" పేరుతో డిజైన్లకు టెండర్లను ఆహ్వానించింది. కొత్త భవన్ నిర్మాణాన్ని మొత్తం Read more

నేడు ప్రవాసీ భారతీయ అవార్డులను ప్రదానం
నేడు ప్రవాసీ భారతీయ అవార్డుల ప్రదానం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఒడిశాలో నిర్వహిస్తున్న 18వ ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సదస్సు ముగింపు సమావేశంలో ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను ప్రదానం Read more

Waqf Bill: వక్ఫ్ బిల్లు చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి?
వక్ఫ్ బిల్లు చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి?

వక్ఫ్ ( సవరణ) బిల్లు 2024 బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇవాళ (బుధవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టబోతోంది. ఈ బిల్లుపై చర్చకు ఎనిమిది గంటలు కేటాయించామని, అవసరమైతే దీన్ని Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×