Nara Lokesh: జగన్ పై విరుచుకుపడ్డ నారా లోకేశ్

Nara Lokesh: జగన్ పై విరుచుకుపడ్డ నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రజలను గాలికి వదిలేసి, ప్రజాధనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా కూడా లేని సమయంలోనే, మంగళగిరి నియోజకవర్గ ప్రజల పట్ల తన బాధ్యతను గుర్తించి, వారి స్వయం ఉపాధికి చేయూతనందించేందుకు వ్యక్తిగత నిధులను వెచ్చించానని లోకేశ్(Nara Lokesh) తెలిపారు. కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ అండగా నిలిచానని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ లోకేశ్ ఈ సందర్భంగా మండిపడ్డారు. జగన్ గారూ మీరు అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్ర‌జ‌ల‌ని గాలికి వ‌దిలేసి, జ‌నం సొమ్ము దోచుకోవ‌డమే ప‌నిగా పెట్టుకున్నారు. అప్పుడు నేను ఎమ్మెల్యేనీ కూడా కాను. ప్ర‌జ‌ల కోస‌మే పుట్టిన తెలుగుదేశం పార్టీ నాయ‌కుడిగా, నా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు స్వ‌యం ఉపాధికి చేయూత‌నందించాల‌ని నిర్ణ‌యించుకున్నాను. మ‌హిళ‌లు, చేనేత‌లు, స్వ‌ర్ణ‌కారులు, చిరువ్యాపారుల‌కు అవ‌స‌ర‌మైన సామాగ్రి, ఆర్థిక సాయంతో చేయూత‌నందించాను. వీట‌న్నింటికీ నా సొంత నిధులు వెచ్చించాను. 

Advertisements
 Nara Lokesh: జగన్ పై విరుచుకుపడ్డ నారా లోకేశ్
Nara Lokesh: జగన్ పై విరుచుకుపడ్డ నారా లోకేశ్

ఆలోచన

త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డాల‌నుకునే మ‌హిళామ‌ణులు వేలాదిమందికి స్త్రీశ‌క్తి పేరుతో ఉచితంగా శిక్ష‌ణ ఇచ్చి, ట్రైనింగ్ పూర్త‌య్యాక స‌ర్టిఫికెట్లు, ఉచితంగా టైల‌రింగ్ మిష‌న్‌, మెటీరియ‌ల్ అంద‌జేశాను. మంగ‌ళ‌గిరి స్త్రీ శ‌క్తి కేంద్రం 2022 జూన్‌20 ప్రారంభించాం. ఈ కేంద్రం ఇప్ప‌టివ‌ర‌కూ 43 బ్యాచ్ లలో 2226 మంది శిక్ష‌ణ పూర్తిచేసుకోగా, వీరంద‌రికీ మిష‌న్లు అంద‌జేశాం.ఇవ‌న్నీ నా జేబులోంచి తీసిన డ‌బ్బులు, నా ఖాతాల నుంచి వెచ్చించిన సొమ్ములు కాబ‌ట్టే శుభానికి సంకేత‌మైన నా పార్టీ ప‌సుపు రంగు(Yellow Colour) మిష‌న్లు ఇచ్చాను. జ‌నం సొమ్ముతో పెట్టిన ప‌థ‌కాల‌కు నీలా పార్టీ రంగులు, నీ పేర్లు పెట్టుకోవాల‌నే ఆలోచన మాకు లేదు. నీ అబ‌ద్ధం తాత్కాలికం. మా నిజం శాశ్వ‌తం” అంటూ లోకేశ్ వెల్లడించారు.

Read Also: Andhra Pradesh: ఆంధ్రాలో ఆర్మీ కుటుంబాలకు ఆస్తిపన్ను మినహాయింపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Related Posts
గర్భిణులు బాలింతలు జాగ్రత్త
గర్భిణులు బాలింతలు జాగ్రత్త

గర్భిణులు బాలింతలు జాగ్రత్త.ఆంధ్రప్రదేశ్‌లో గర్భిణులు, బాలింతలను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు ఫేక్ లింకులు, మెసేజెస్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. 'జనని సురక్ష యోజన' పథకం ద్వారా Read more

ముందస్తు బెయిల్‌ ఇవ్వండి..హైకోర్టులో ఆర్జీవీ
Grant anticipatory bail.Ram Gopal Varma in High Court

అమరావతి: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే క్వాష్‌ పిటిషన్‌ విషయంలో ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన Read more

Delhi: నేడు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు,పవన్
ఆంధ్రాలో లాటరీలు, ఆన్‌లైన్ గేమింగ్‌ అనుమతించే ఆలోచన!

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ – ప్రధానితో కీలక చర్చలు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ Read more

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం
పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు

అమరావతి- సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం15 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఈ పెట్టుబడుల ద్వారా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×