నందమూరి తారకరత్న అనే పేరు వినగానే ఆయన జీవితంలో అనేకమైన జ్ఞాపకాలు మెదలుతాయి. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఈ యువ హీరో, కేవలం 39 ఏళ్ల వయస్సులోనే హార్ట్ అటాక్తో కణతిక్షణంగా ఈలోకాన్ని విడిచిపెట్టాడు. తన ప్రత్యేకమైన నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకొని, మృదువైన నటనతో ఎంతో మంది అభిమానులను దక్కించుకున్నాడు తారకరత్న, తన సినీ ప్రయాణంలో కేవలం కొన్ని సినిమాలు చేసినప్పటికీ, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకున్నాడు. 2001లో 9 సినిమాలను విడుదల చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఆయన, 2002లో విడుదలైన “ఒకటో నంబర్ కుర్రాడు” చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత వరుసగా నటించిన సినిమాలు, తన నటనను మళ్లీ మళ్లీ నిరూపించాయి.
తారకరత్న, అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకుని ఇద్దరు కుమార్తెలతో పాటు ఒక కుమారుడికి తండ్రిగా మారాడు. అలేఖ్య రెడ్డి, సోషల్ మీడియా ద్వారా తరచూ తమ కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇటీవల, తమ పెద్ద కుమార్తె నిష్కకు సంబంధించిన హాఫ్ శారీ ఫంక్షన్ను గురించి పంచుకున్నారు ఈ కార్యక్రమంలో తారకరత్న జ్ఞాపకాలను నిలుపుకునేలా, ఆయన ఫోటోలతో ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. నిష్క, కుందనపు బొమ్మలా అందంగా హాఫ్ శారీ ధరించి, వేడుకకు ముఖ్య ఆకర్షణగా నిలిచింది. నుదుటలో పాపిడి బొట్టు, మెడలో బంగారు ఆభరణాలు, నడుముకు వడ్డానం చెవులకు పెద్ద బుట్టలు ధరించి, ఆమె అందాన్ని మరింత పెంచింది.
ఈ వేడుకలో అలేఖ్య రెడ్డి, వారి కుటుంబ బంధువులు, స్నేహితులు, మరియు ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు ముఖ్యంగా మాజీ ఎంపీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరియు ఆయన భార్య సతీసమేతంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి, నిష్కకు ఆశీర్వదించారు ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అలేఖ్య రెడ్డికి ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు వారి కుటుంబ జీవితం నందమూరి తారకరత్న స్మృతులను మధురంగా నెనపుకుంటూ, ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని చేకూరుస్తోంది.