Nagaland : జిహెచ్ఎంసిని సందర్శించిన నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారులు
హైదరాబాద్, ప్రభాతవార్త: నగరంలో అమలు చేస్తూ వచ్చిన వివిధ పథకాలు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో జిహెచ్ఎంసి ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు నాగాలాండ్ సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమం లో భాగంగా, పబ్లిక్ పాలసీ, గుడ్ గవర్నెన్స్, మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పై శిక్షణ పొందుతున్న నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారులు సోమవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్శనలో అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి జిహెచ్ఎంసి ద్వారా ప్రజలకు అందించే సేవలు, ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాలు, అలాగే అమలు చేస్తున్న పథకాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, భవన నిర్మాణ వ్యర్థాలు (సి అండ్ డి), హెల్త్, వెటర్నరీ, ఫుడ్ సేఫ్టీ యాక్టివిటీస్, ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ వంటి విభాగాలలో జిహెచ్ఎంసి చేస్తున్న పనులపై కూడా చర్చించారు.
Nagaland : సివిల్ సర్వీసెస్ అధికారులు జిహెచ్ఎంసి కీలక కార్యక్రమాలపై అవగాహన పొందారు
అనంతరం, నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడానికి జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు వెళ్లి, సాలిడ్ వెస్ట్ నిర్వహణపై అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమంలో నాగాలాండ్ సీనియర్ సివిల్ సర్వీసెస్ వివిధ విభాగాల జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, తదితర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్శన ద్వారా జిహెచ్ఎంసి పథకాల పనితీరు మరియు నగరంలోని మౌలిక సదుపాయాలపై నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారులకు మరింత అవగాహన ఏర్పడినట్లు తెలుస్తోంది.
Read More : Shivangi Movie: ‘శివంగి’ మూవీ రివ్యూ