శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలానికి చెందిన కల్లి తాండా గ్రామం ఈ మధ్య ఓ విషాద వార్తతో national headlines లోకి వచ్చింది. ఆ గ్రామం ఓ నిజమైన వీరుడిని కోల్పోయింది – మురళీ నాయక్, పాకిస్థాన్తో జరిగిన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భారత సైనికుడు.ఈ వార్త వినగానే గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. కానీ, ఈ రోజు ఆ గ్రామానికి ఓ ఊహించని అతిథి వచ్చారు – ప్రముఖ జానపద గాయనిచే మంగ్లీ.మురళీ నాయక్ కుటుంబాన్ని కలుసుకున్న మంగ్లీ, ప్రత్యేకంగా ఆయన తల్లిని ఓదార్చే ప్రయత్నం చేశారు. కన్నీళ్లతో వెదజల్లుతున్న ఆ తల్లి బాధను చూసి, ఆమెకూ, చుట్టుపక్కల వాళ్లకూ భరోసా ఇచ్చేలా మాట్లాడారు.
మీడియాతో మాట్లాడిన మంగ్లీ మాటల్లో భావోద్వేగం, గర్వం, వ్యథ అన్నీ పాఠకుడికి అర్థమయ్యేలా ఉన్నాయ్.”మురళీ నాయక్ తన ప్రాణాలను దేశం కోసం అర్పించాడు.మహిళల సిందూరం కోసం ప్రాణం పెట్టాడు. అలాంటి వీరుడిని మరిచిపోలేం,” అని ఆమె అన్నారు.మరియు, “ప్రతి మహిళ కూడా సిందూరం వేసుకునే ప్రతిసారి వీర జవాన్ల త్యాగాన్ని గుర్తించాలి” అని సూచించారు. ఇది కేవలం ఒక వ్యక్తి మరణం కాదు – ఇది ఒక మాతృభూమి కోసం జరిగిన త్యాగం అని మంగ్లీ అన్నారు.మురళీ నాయక్ కుటుంబానికి తమ్ముడు, అక్క, అన్న, చెల్లెమ్మ ఎవ్వరూ లేరు. అతడే ఒక్క కొడుకు.
ఆ తల్లికి మురళీ అనగానే ప్రపంచమే. ఇప్పుడు ఆమె కళ్లలో ఆ వెలుగు మసికొలిపినట్లైంది. “ఇప్పటినుంచి మురళీ నాయక్ దేశంలోని ప్రతి అమ్మకు కొడుకే” అని మంగ్లీ అర్దవంతంగా చెప్పారు.ఈ వీరుడి కుటుంబానికి తగిన గుర్తింపు రావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని మంగ్లీ కోరారు. “ఇలాంటి జవాన్లు మాత్రమే దేశాన్ని కాపాడుతున్నారు. వారి కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత” అని స్పష్టంగా చెప్పారు.మురళీ నాయక్ త్యాగం మాటల్లో చెప్పలేనిది. కానీ ఆ తల్లికి భరోసా ఇచ్చే మంగ్లీ చేసిన పని కూడా ప్రశంసనీయం. ఈ దేశం మనతోనే కాదు – అలాంటి వీరుల త్యాగాలతో నిలబడుతోంది.
Read Also : Drone attacks : డ్రోన్ లాంచ్ప్యాడ్స్ ధ్వంసం చేసిన భారత్