Andhra Pradesh: ఈ నెల 20 నుంచి మున్సిపల్ ఉద్యోగుల సమ్మె

Andhra Pradesh: ఈ నెల 20 నుంచి మున్సిపల్ ఉద్యోగుల సమ్మె

ఏపిలోని మున్సిపల్ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. మే 20వ తేదీ నుంచి ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ఇప్పటికే అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. మంగళవారం మున్సిపల్ శాఖ అదనపు డైరెక్టర్‌ మురళీకృష్ణ గౌడ్‌కు మున్సిపల్ కార్మికుల సంఘం ప్రతినిధులు సమ్మె నోటీసులు ఇచ్చారు. కనీస వేతనాన్ని రూ. 26 వేలకు పెంచడంతో పాటుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనంగా 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ శాఖలో కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తొలగిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో మే 20 నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు.

Advertisements

ఉపసంహరణ

2024లోనూ ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు. సమాన పనికి సమాన వేతనం సహా పలు డిమాండ్లను పరిష్కరించాలంటూ అప్పట్లో సమ్మె బాట పట్టారు. అనంతరం ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావటంతో సమ్మె విరమించారు. కార్మికుల కొన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు అప్పటి వైసీపీ సర్కారు అంగీకరించింది. రూ.15వేల జీతంతో పాటుగా హెల్త్ అలవెన్స్ రూ.6 వేలు కలిపి 21 వేలు ఇచ్చేందుకు అప్పట్లో ప్రభుత్వం అంగీకరించింది.అలాగే జీతం పెంపుదల సమయంలో కనీస వేతనాన్ని 21 వేలుగా పరిగణిస్తామని హామీ ఇచ్చింది. ఇక సమ్మెకాలంలో జీతం, కేసుల ఉపసంహరణకు అప్పట్లో ప్రభుత్వం అంగీకరించింది. అలాగే మున్సిపల్ కార్మికులు ప్రమాదవశాత్తూ చనిపోతే అందించే పరిహారం మొత్తాన్ని కూడా రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు పెంచుతామని హామీ ఇస్తారు. దీంతో అప్పట్లో మున్సిపల్ కార్మికులు సమ్మెను విరమించుకున్నారు.

 Andhra Pradesh: ఈ నెల 20 నుంచి మున్సిపల్ ఉద్యోగుల సమ్మె

కార్మికుల

తాజాగా మరోసారి మున్సిపల్ కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది. కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలనే డిమాండ్‌తో పాటుగా పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ కార్మికుల సంఘం నోటీసులు ఇచ్చింది. మరోవైపు మున్సిపల్ కార్మికులతో చర్చలు జరిపే ఆలోచనలో పురపాలక శాఖ అధికారులు ఉన్నారు. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

Read Also :Pawan Kalyan: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఎందుకంటే?

Related Posts
Injury : సుజనా చౌదరికి తీవ్ర గాయం
sujana2

బీజేపీ నేత,ఎమ్మెల్యే సుజనా చౌదరికి విదేశీ పర్యటనలో తీవ్ర గాయం జరిగింది. లండన్‌లో ఉన్న సమయంలో ఒక సూపర్ మార్కెట్‌లో ప్రమాదవశాత్తూ ఆయన కిందపడిపోయారు. ఈ ఘటనలో Read more

నవంబర్ 01 న దీపం 2 పథకానికి శ్రీకారం
నవంబర్ 01 న దీపం 2 పథకానికి శ్రీకారం

ఏపీలో దీపం 2 పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 1న శ్రీకారం చుడతారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మంత్రి మాట్లాడుతూ, అక్టోబర్ 29న Read more

తిరుమల మృతులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా
ttd temple

టీటీడీలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. కాగా తిరుపతి తొక్కిసలాటలో మృతిచెందిన వారికి ఏపీ ప్రభుత్వం భారీగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి Read more

ఢిల్లీ బొమ్మలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే
ఢిల్లీ బొమ్మలపై .డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే

దేశ రాజధాని ఢిల్లీ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటం ప్రత్యేకంగా ప్రదర్శింపబడింది. ఈ శకటంలో ఏటికొప్పాక బొమ్మలు ఉన్న విషయం డిప్యూటీ సీఎం Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×