ముద్రగడ ఫై విమర్శలు చేసిన కూతురు

పవన్ ను ప్రశ్నించే అర్హత ముద్రగడ లేదంటూ ముద్రగడ కుమార్తె క్రాంతి కౌంటర్‌ ఇచ్చారు. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, పిఠాపురంలో పవన్ ఓడిపోతాడని ముద్రగడ వ్యాఖ్యానించారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో పవన్ ఓడిపోకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేశారు. అయితే ఎన్నికల్లో పవన్ ఘన విజయం సాధించటంతో అన్నట్లుగానే తన పేరును మార్చుకున్నాడు. అయినప్పటికీ ముద్రగడ ..పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేయడం ఆపడం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలు మానేయాలని సూచించారు.

దీనిపై ముద్రగడ కూతురు ఫైర్ అయ్యింది. ‘మా తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఆయన ఆలోచనా విధానం మాత్రం మార్చుకోకపోవడం ఆందోళనగా ఉంది’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పేరు మార్చుకున్నాక కాపుల గురించి, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ గురించి ఆయనకు ఎందుకని ప్రశ్నించారు. సమాజానికి ఏం చేయాలో పవన్‌కల్యాణ్‌కు స్పష్టత ఉందని, తన తండ్రికి మాత్రమే లేదని అనిపిస్తోందని అన్నారు. శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తున్నానని, మరో దఫా పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తానని క్రాంతి స్పష్టం చేశారు.