తెలుగులో ప్రమాణం చేసిన తెలుగు రాష్ట్రాల ఎంపీలు

రీసెంట్ గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలుగా విజయం సాధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ఈరోజు లోక్ సభ లో ప్రమాణం చేసారు. అయితే వీరిలో కొంతమంది ఇంగ్లీష్ లో ప్రమాణం చేయగా..చాలామంది తెలుగు లో ప్రమాణం చేసారు. సోమవారం 18వ లోక్‌సభ తొలి సమావేశాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. ముందుగా ప్రధాని మోదీ వార‌ణాసి ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసారు.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి కింజ‌రాప్ రామ్మోహన్‌ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. విశాఖపట్టణం టీడీపీ ఎంపీ శ్రీభరత్ ఎంపీగా తెలుగులో, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇంగ్లీషులో,కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్(టీ టైమ్ ఉదయ్) ఆంగ్లంలో , విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలుగులో ప్రమాణం చేసారు. తెలంగాణలో సికింద్రాబాద్​ లోక్​సభ స్థానం నుంచి విజయం సాధించిన కిషన్​ రెడ్డి ఎంపీ, కరీంనగర్​ నుంచి గెలుపొందిన బండి సంజయ్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు కేంద్రమంత్రులు తెలుగులో తమ ప్రమాణాన్ని చేశారు.