కేసీఆర్ వచ్చిన బీజేపీలోకి ఆహ్వానిస్తాం – ఎంపీ రఘునందన్

మెదక్ బిజెపి రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. శనివారం హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు సీఆర్ఎస్ (కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం) ఖాయమని ..హరీష్ రావు, కేసీఆర్ బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని అన్నారు. ములుగు మండలం క్షీర సాగర్ గ్రామంలో 80 మంది దళితుల భూములు అక్రమంగా వెంకట్ రాం రెడ్డి లాక్కున్నారన్నారు. క్షీర సాగర్ నుంచే పని మొదలుపెడతా.. దళితుల భూములు వారికి అప్పగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

జగ్గారెడ్డి పెరిగింది ఆర్ఎస్ఎస్‌లో.. ఆయన మొదట గెలిచింది బీజేపీ నుంచే అని గుర్తుచేశారు. జగ్గారెడ్డి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఉందని తీవ్ర విమర్శలు గుప్పించారు. మెదక్‌కు ఇందిరమ్మ రాకముందే బీహెచ్ఈఎల్, ఇక్రిశాట్ వచ్చాయన్నారు. సమ్మిళితంగా మెదక్ ను డెవలప్ చేస్తామని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని హామీ ఇచ్చారు. నీట్ పరీక్షపై ప్రతిపక్షాలు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని, కోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం అన్ని వివరాలు ఇవ్వనుందని స్పష్టంచేశారు.