Mohan Babu lunch motion petition in the High Court

హైకోర్టును ఆశ్రయించిన మోహన్‌బాబు

హైదరాబాద్‌: మంచు కుటుంబంలో గొడవలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఈక్రమంలోనే నటుడు మోహన్‌బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రిపోర్టర్ పై దాడి కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పీకెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. తాను సెక్యూరిటీ కోరినప్పటికీ భద్రత కల్పించలేదని.. వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మోహన్ బాబు తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిష‌న్‌ను హైకోర్టు మధ్యాహ్నం 2.30కి విచారించ‌నుంది.

గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీలో మంటలు చర్చనీయాంశంగా మారాయి. మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య నెలకొన్న వివాదం మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జన్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మంచు మనోజ్ తన భార్య సతీమణితో కలిసి రావడం.. అక్కడ వారిని రానీయకుండా మంచు విష్ణు ఏర్పాటు చేసిన బౌన్సర్లు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచు మనోజ్ బౌన్సర్లు, మంచు విష్ణు ఏర్పాటు చేసిన బౌన్సర్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మంచు మనోజ్ ఎవరినీ లెక్క చేయకుండా గేట్లను బద్దలు కొట్టుకుంటూ ఇంట్లోకి దూసుకెళ్లిపోయారు. ఆ తరువాత చిరిగిన చొక్కాతో ఆయన బయటకు వచ్చారు.

మరోవైపు జ‌ల్‌ప‌ల్లిలో మోహన్ బాబు ఇంటివ‌ద్ద మీడియాపై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌పై పోలీస్ శాఖ సీరియ‌స్ అయిన‌ట్లు స‌మాచారం. మోహ‌న్ బాబు చూట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని.. అలాగే మోహన్ బాబు విష్ణు దగ్గర ఉన్న గన్లను కూడా డిపాజిట్ చేయాల‌ని ఆదేశాలు ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

Related Posts
ఎమ్మెల్యేకు అర్ధరాత్రి మహిళ న్యూడ్ వీడియోకాల్
woman videocall

ఈ మధ్య రాజకీయ నేతలను మహిళలు వలలో వేసుకుంటూ..వారి రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. రాజకీయ నేతలతో చావు పెంచుకోవడం..ఆ తర్వాత వారితో శారీరక సంబంధాలు ఏర్పరచుకోవడం..వారికీ Read more

అర్ధరాత్రి వెలిసిన మావోయిస్టు ఫ్లెక్సీలు
Maoist flexi

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ముసలిమడుగు పంచాయతీలోని సందళ్లు రాంపురంలో గ్రామంలో మణుగూరు-పాల్వంచ డివిజన్ ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టుల ఫ్లెక్సీలు వెలిశాయి. "మావోయిస్టు Read more

లడాఖ్ పరిమిత సరిహద్దు వివాదం: రాజ్‌నాథ్ సింగ్-చైనా రక్షణ మంత్రితో భేటీ
india china

భారతదేశం మరియు చైనాకు మధ్య ఉన్న లడాఖ్ పరిమిత సరిహద్దు వివాదం ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ సరిహద్దు వివాదం ప్రధానంగా ఐదు ప్రాంతాలలో చోటు Read more

అన్నదాత పథకం క్రింద రైతుకు 20 వేలు : అచ్చెన్నాయుడు
20 thousand to farmers under Annadata scheme.. Atchannaidu

అమరావతి: మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రకారం, ఎన్నికల ప్రచారంలో చెప్పిన ప్రకారం, అన్నదాత సుఖీభవ పథకం క్రింద, అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం Read more