Mohammad Kaif: విరాట్ కోహ్లీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ కైఫ్

Mohammad Kaif: విరాట్ కోహ్లీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ కైఫ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ లో ప్రత్యర్థులను వారి సొంత వేదికలపై చిత్తు చేస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ సొంత వేదికపై మాత్రం మరోసారి ఓటమివైపు నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో మాదిరిగానే పంజాబ్‌తోనూ అదే రిపీట్‌ అయింది. శుక్రవారం వర్షం అంతరాయంతో 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఐదు వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై ఘన విజయం సాధించింది. ఆర్‌సీబీ నిర్దేశించిన 96 పరుగుల ఛేదనలో పంజాబ్‌ 12.1 ఓవర్లలో 98/5 స్కోరు చేసింది.బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్‍ను 14 ఓవర్లకు కుదించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ కొన్ని పరుగులకే ఔటయ్యారు.

Advertisements

తీవ్ర నిరాశ

2025 సీజన్‌ లో ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. విరాట్ కోహ్లీ 7 మ్యాచ్‌ల్లో 249 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 49.8 సగటు, 141.47 స్ట్రైక్ రేట్‌తో రాణించాడు. కోహ్లీ మూడు హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీ కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు.ఈ పరిస్థితిలో 14 ఓవర్ల మ్యాచ్‌లో వారిద్దరూ దూకుడుగా ఆడతారని భావించినప్పటికీ.. ఇద్దరూ వరుసగా ఔటవ్వడం తీవ్ర నిరాశ కలిగించింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కేవలం 3 బంతులు ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. దీని కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరుగులు సాధించడంలో ఇబ్బంది పడింది. 14 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 12.1 ఓవర్లలోనే సాధించింది.

 Mohammad Kaif: విరాట్ కోహ్లీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ కైఫ్

మొదటి బంతి

భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ, “విరాట్ కోహ్లీ మొదటి బంతి నుంచే కొట్టడానికి ప్రయత్నించాడు. కోహ్లీ సాధారణంగా 20 ఓవర్ల మ్యాచ్‌లలో ఇలా కొట్టడు. ఇది 14 ఓవర్ల మ్యాచ్ కాబట్టి విరాట్ కోహ్లీ మొదటి బంతి నుంచే కొట్టాలని అనుకున్నాడు. కానీ ఇంత కఠినమైన పిచ్ లపై ముందుగా కొంత సమయం తీసుకోవాలి. విరాట్ కోహ్లీ మొదటి 5 బంతుల వరకు కొంచెం ఓపికగా ఉండి.. ఆ తర్వాత ఆటలోకి దిగి ఉండవచ్చు. కానీ విరాట్ కోహ్లీ దీనిని 6 ఓవర్ల మ్యాచ్ అనుకున్నాడు. అందుకే చెడు షాట్ ఆడి ఔట్ అయ్యాడు” అని మహ్మద్ కైఫ్ విమర్శించాడు.

Read Also: IPL 2025: ఐపీఎల్ సీజన్లో లో ప్లే ఆఫ్స్ కు చేరే జట్లు ఏవో తెలుసా!

Related Posts
Bandh : డ్రైవర్‌పై దాడికి నిరసనగా..రేపు కర్ణాటక బంద్
డ్రైవర్‌పై జరిగిన దాడికి నిరసనగా..రేపు కర్ణాటక బంద్

మహారాష్ట్రలో తాజాగా KSRTC బస్సు డ్రైవర్‌పై జరిగిన దాడికి నిరసనగా కన్నడ అనుకూల సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. దింతో రేపు మార్చి 22న బెంగళూరులో అంతరాయాలు Read more

Uttar Pradesh: అల్లుడితో పారిపోయిన అత్త..తల పట్టుకున్న పోలీసులు
Uttar Pradesh: అల్లుడితో పారిపోయిన అత్త..తల పట్టుకున్న పోలీసులు

యూపీలోని అలీఘర్‌ జిల్లాలో తన కూతురికి కాబోయే భర్తతో ఓ మహిళ పారిపోయిన వార్త దేశ వ్యప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల స్వప్న Read more

Canada: కెనడాలో భారతీయ విద్యార్థిని మృతి
Canada: కెనడాలో భారతీయ విద్యార్థిని మృతి

కెనడాలో వంశిక అనుమానాస్పద మృతి కలకలం కెనడాలోని ఒట్టావాలో భారతీయ విద్యార్థిని వంశిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పంజాబ్ రాష్ట్రంలోని డేరా Read more

Pahalgam Attack: భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలపై జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు
Pahalgam Attack: భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలపై జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకున్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గురువారం స్పందించారు. భారత్ ప్రతిస్పందన ప్రాంతీయ సంఘర్షణకు దారితీయకుండా ఉండాలన్న వాన్స్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×