20240302 PAT SK MN Narendra Modi 44 0 1709511366004 1709511386443

Modi : ఏపీకి మోడీ రాక..కట్టుదిట్టమైన భద్రత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా వెలగపూడి సచివాలయానికి చేరుకొని అక్కడ జరిగే సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటనలో భాగంగా అమరావతిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.

Advertisements

మోడీ షెడ్యూల్

ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం 2:55 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 3:15కు వెలగపూడికి చేరుకుంటారు. అనంతరం 3:30 గంటలకు సభాస్థలికి చేరుకుని, రాజధాని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సభ ముగిశాక సాయంత్రం 4:55 గంటలకు తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. ఈ సభకు సచివాలయ ఉద్యోగులంతా తప్పనిసరిగా హాజరుకావాలని సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.

కట్టుదిట్టమైన ఏర్పాట్లు

భద్రత విషయానికొస్తే, కేంద్ర–రాష్ట్ర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పాక్‌తో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, ప్రధాని ప్రయాణించే మార్గాల్లో పటిష్ట చర్యలు తీసుకున్నారు. వర్షం పడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాన్ బీ కూడా సిద్ధం చేశారు. ప్రధాని వాహనం వెళ్లే మార్గంలో ప్రజలు స్వాగతం పలుకేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద, మోదీ పర్యటన విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నారు.

Read Also : Real Estate : అమరావతిలో మళ్లీ భూములకు రెక్కలు

Related Posts
Drought zones : ఏపీలో 51 కరువు మండలాలు గుర్తింపు
51 drought zones identified in AP

Drought zones: ఏపీలోని 51 కరువు మండలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తీవ్ర ఎండలు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కరువు మండలాలను గుర్తించాలని అధికారులను ప్రభుత్వం అదేశించింది. Read more

ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి Nitin Gadkari
ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి Nitin Gadkari

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర రహదారి మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలకమైన సమాచారం అందించారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు Read more

మరోసారి తిరుమలలో బాంబు బెదిరింపులు..
మరోసారి తిరుమలలో బాంబు బెదిరింపులు..

తిరుమల: ప్రఖ్యాత పర్యాటక పుణ్యక్షేత్రం తిరుపతిలో ఇటీవల బాంబు బెదిరింపులతో వచ్చిన విషయం తెలిసిందే. ఈ బెదిరింపులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటివరకు అనేక సార్లు Read more

నా ఇంటికి నన్ను ఎందుకు వెళ్లనివ్వడం లేదు : కేతిరెడ్డి పెద్దారెడ్డి
peddareddy

అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్వగ్రామం తాడిపత్రికి వచ్చేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాట్లు చేసుకోగా.. అందుకు పోలీసులు అనుమతించని పరిస్థితి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×