సినీ ప్రముఖులతో మోడీ ఈ ఏడాది చివర్లో “వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్” (WAVES) ను నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం ప్రధాని మోదీ సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో వారు తమ సలహాలు సూచనలు పంచుకున్నారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, హేమమాలిని, దీపికా పద్కొణే, ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగం చేసినందుకు చిరంజీవి ప్రధాని మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ (ఎక్స్) వేదికపై చిరంజీవి వెల్లడించారు. “గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఈ గౌరవానికి ధన్యవాదాలు. WAVES సలహా బోర్డులో భాగం కావడం, ఇతర ప్రముఖులతో నా అభిప్రాయాలు పంచుకోవడం ఒక అదృష్టం.

మోదీ జ్ఞానసంతానం అయిన WAVES, భారత్కు ‘సాఫ్ట్ పవర్’ ను ప్రపంచంలో ఎత్తుకు తీసుకెళ్లే శక్తిగా ఉంటుందని నమ్ముతున్నాను. త్వరలోనే కొత్త ప్రగతికి సిద్ధంగా ఉండండి” అంటూ చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు.ఈ సమావేశం భారత సినిమా రంగం మరియు ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ రంగంపై ప్రపంచవ్యాప్తంగా మరింత దృష్టి సారించడం కొత్త అవకాశాలను తెరవడం కోసం ఎంతో కీలకమైనది. WAVES సమ్మిట్ను జాగ్రత్తగా ప్రణాళికతో నిర్వహించడం ద్వారా భారతీయ సినిమా, టెలివిజన్, మ్యూజిక్, డిజిటల్ మీడియా రంగాలను అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు పరిశ్రమలు కలిసి పనిచేస్తున్నాయి.ప్రధాని మోదీతో ఈ సమావేశంలో భాగమైన సినీ ప్రముఖులు తమ ఆలోచనలను పంచుకోవడంతో ఈ సమ్మిట్ వల్ల అంతర్జాతీయ మరియు దేశీయ ప్రేక్షకులందరికి కొత్త జ్ఞానం అనుభవాలు అందించే అవకాశం ఉంది.