modi delhi

ఢిల్లీ ఎన్నికల విజయంపై మోదీ ట్వీట్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం పొందడంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘జనశక్తి ప్రధానం. అభివృద్ధి, సుపరిపాలనను గెలిపించారు. ఈ చరిత్రాత్మక విజయాన్ని అందించిన ఢిల్లీలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు సెల్యూట్. ఢిల్లీని అభివృద్ధి చేయడంలో, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో, వికసిత్ భారత్ ను నిర్మించడంలో ఢిల్లీ ప్రధాన పాత్ర పోషించే విధంగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. ఈ చరిత్రాత్మక విజయాన్ని ఢిల్లీలోని ప్రజలికి మోడీ అంకితమిచ్చారు. ఈ విజయం ప్రజల ఆకాంక్షల ప్రతిబింబంగా, ప్రజల బలం అభివృద్ధి కోసం కొనసాగించిన ప్రగతిని తెలిపే సంకేతంగా ఆయన చాటారు.

elhi bjp

అలాగే ప్రధాని మోదీ మరో కీలకమైన అంశం ఎత్తిచూపారు. ఢిల్లీ ప్రజల సంక్షేమం కోసం కొత్త ప్రణాళికలు రూపొందించడం, ప్రజల అవసరాలను తీర్చడానికి అవసరమైన మార్గాలను ఆవిష్కరించేందుకు బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చాడు. ఇక మునుపటి కంటే.. ఈ సారి ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగాయి. గెలుపు కోసం ఆప్, బీజేపీ గట్టిగా తలపడ్డాయి. ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో..బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఢిల్లీని చుట్టేశారు. మరోవైపు ఆప్ నుంచి కూడా కేజ్రీవాల్ తన శక్తినంతా ఒడ్డి..గెలుపు కోసం ప్రయత్నించారు. చివరి వరకు గట్టి పోటీయే ఇచ్చిన ఆప్.. చెప్పుకోదగ్గ సీట్లు సాధించి ప్రతిపక్షానికి పరిమితమైంది. తమకు డబల్ ఇంజిన్ సర్కారే కావాలంటూ.. ఢిల్లీ ప్రజలు కమలానికే అధికార పీఠం కట్ట పెట్టారు. దీంతో 27 ఏళ్ల తర్వాత.. ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది.

Related Posts
స్పీకర్‌పై జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
స్పీకర్ గడ్డం ప్రసాద్ మనస్తాపం.. జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ వ్యాఖ్యల వల్ల మనస్తాపానికి Read more

మన్మోహన్-నరసింహారావు గౌరవంపై వివాదం
మన్మోహన్-నరసింహారావు గౌరవంపై వివాదం

భారతీయ జనతా పార్టీ (బిజెపి) మరియు కాంగ్రెస్ మధ్య ప్రస్తుతం ఒక పెద్ద గౌరవ వివాదం సంభవించింది. ఈ వివాదం ప్రధానంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ Read more

తాము చేసిన అభ్యర్థనకు భారత్‌ నుంచి స్పందన రాలేదు: యూనస్‌
We have not received a response from India to our request.. Yunus

ఢాకా: భారత్‌ను మాజీ ప్రధాని షేక్‌ హసీనా అప్పగింతపై అధికారికంగా సంప్రదించినట్లు బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ వెల్లడించారు. కానీ, భారత్‌ నుంచి ఇప్పటివరకు అధికారిక Read more

బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి
amrapali kata

రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్‌ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరుగా ఆమ్రపాలి కాట బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ హైకోర్టు తీర్పు అనంతరం ఇటీవల అమ్రపాలి రాష్ట్రానికి వచ్చి రిపోర్టు Read more