నేడు ముంబై లో ప్రధాని మోడీ పర్యటన

pm-modi-speech-for-indian-diaspora-in-moscow

ప్రధాని మోడీ ఈరోజు ముంబై లో బిజీ బిజీ గా పర్యటించనున్నారు. దాదాపు 29, 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ముంబైలోని గోరేగావ్‌లోని నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్‌కు సాయంత్రం 5.30 గంటలకు చేరుకోనున్న ప్రధాని.. అక్కడ రోడ్లు, రైల్వేలు, ఓడరేవు రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

16,600 కోట్ల రూపాయల వ్యయంతో థానే బొరివలి టన్నెల్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. గోరేగావ్ ములుండ్ లింక్ రోడ్ (జీఎంఎల్‌ఆర్) ప్రాజెక్టులో రూ. 6,300 కోట్లతో నిర్మించనున్న సొరంగ మార్గానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. నవీ ముంబైలో కళ్యాణ్ యార్డ్ రీమోడలింగ్, గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్‌కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబదించిన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేసారు.