Modi government has brought a new scheme for women named Swarnima

‘స్వర్ణిమ’ పేరుతో మహిళలకు కొత్త పథకం తీసుకొచ్చిన మోడీ సర్కార్‌

న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పథకాలను గతంలో కూడా ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం కూడా తీసుకువస్తున్నారు. తాజాగా ‘స్వర్ణిమ’ పేరుతో ఓ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకంద్వారా వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉన్న పేద మహిలలకు రూ.2 లక్షల రుణం లభిస్తుంది. ఏడాదికి వడ్డీ కేవలం ఐదుశాతం పడుతుంది. దీనివల్ల ఆర్థికంగా వెనకబడినవర్గాలకు చెందిన మహిళలు నిలదొక్కుకునే అవకాశం ఏర్పడటమే కాకుండా మరో 10 మందికి ఉపాధి కల్పిస్తారనేది ప్రధానమంత్రి అభిప్రాయంగా ఉంది.

జాతీయ బీసీల ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NBCFDC) ఈ పథకాన్ని పరిచయం చేస్తోంది. స్టేట్ చాన్నెలైజింగ్ ఏజెన్సీలు (SCAs) నోడల్ ఏజన్సీలుగా వ్యవహరిస్తాయి. రూ.2 లక్షల రుణం పొందే మహిళలు అంతకంటే ఎక్కువ కావాలంటే సొంతంగా పెట్టుబడి పెట్టుకోవాలి. తాను స్థాపించదలుచుకున్న ప్రాజెక్టు వ్యయం రూ.2 లక్షల వరకు ఉండాలి. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునేవారి వయసు 18 నుంచి 55 సంవత్సరాల్లోపు ఉండాలి. తప్పనిసరిగా పారిశ్రామికవేత్తలైనవారే దీనికి దరఖాస్తు చేసుకోవాలి. వారి కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల కంటే తక్కువగా ఉండాలి.

ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్టు సైజ్ ఫొటో, కుల ధ్రువీకరణ పత్రాలు దగ్గరుండాలి. తమకు సమీపంలో ఉండే ఎస్ సీఏ కార్యాలయానికి వెళ్లాలి. అది ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు అడ్రస్ లో తెలుసుకోవాలి. తమకు ఎంత రుణం కావాలి? ఏ విధంగా శిక్షణ కావాలి అనే విషయాలను వివరించి చెప్పాలి. పైన చెప్పిన పత్రాలన్నింటినీ సమర్పించాలి. అధికారులు తమకు అందిన దరఖాస్తులను అన్నిరకాలు పరిశీలించిన తర్వాత అర్హులైనవారికి రుణాన్ని మంజూరు చేస్తారు.

Related Posts
హైదరాబాద్ లో గ్రాండ్ గా యమహా కామిక్ కాన్ లాంచ్
Yamaha Grand Debut at Comic

ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ 15 నవంబర్ 2024 నుండి 17 నవంబర్ 2024 వరకు హైదరాబాద్‌లో జరిగే కామిక్ కాన్ ఇండియా అనే దేశంలోని Read more

ఎలన్ మస్క్‌ను నేపాల్ సందర్శనకు ఆహ్వానించిన ప్రధాని ఓలి..
oli musk

నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. ఈ సమావేశం ఇద్దరి మధ్య Read more

ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేమిరెడ్డి దంపతులు భేటి
Vemireddy couple meet CM Chandrababu

అమరావతి: సీఎం చంద్రబాబును నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలిశారు. ఈ మేరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన వేమిరెడ్డి Read more

నేడు ఈడీ విచారణకు కేటీఆర్
ktr tweet

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలపై కొత్త పరిణామం ఎదురవుతోంది. ఫార్ములా-ఈ కారు రేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఈడీ (ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరుకానున్నారు. ఆయన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *