ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో జీవన్ రెడ్డి..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం అనేది కొనసాగుతూనే ఉంది. బిఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున నేతలు చేరుతూనే ఉన్నారు. మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలే కాదు..ప్రస్తుతం ఎమ్మెల్యేలు సైతం కారు దిగి చేతి కిందకు వస్తున్నారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్..సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగింది. అయితే ఈయన చేరిన ఫై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాస్త అసహనం ఉన్నట్లు సమాచారం. తనకు తెలియకుండా..తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా పార్టీలోకి సంజయ్ ని ఎలా చేర్చుకుంటారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారని తెలుస్తోంది. తన ఎమ్మెల్సీ పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తారని కథనాలు వస్తున్నాయి.

2014 నుంచి జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ జగిత్యాల నుంచి ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు. 2014లో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. 2018, 2023లలో జీవన్ రెడ్డిపై సంజయ్ కుమార్ విజయం సాధించారు. మరోవైపు, జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ నేతలు… జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరినట్లు సమాచారం.