MLC election schedule released

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఎమ్మెల్యే ఎన్నికల షెడ్యూల్‌ను తెలంగాణ ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 11న స్క్రూటినీ నిర్వహించనున్నట్లు పేర్కొంది. నామినేషన్ ఉపసంహరణకు ఫిబ్రవరి 13 చివరి తేదీ అని తెలిపింది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపింది.

తెలంగాణలో ఖాళీ కానున్న మూడు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యింది. ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ మూడు స్థానాలకు ప్రస్తుతం జీవన్ రెడ్డి, కూర రఘోత్తమ్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ అయ్యింది.

image

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. కాగా, ఈ ఎన్నికలు జరుగుతాయని ఇటీవలే బీజేపీ తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం కాస్త ఆలస్యం వహిస్తున్నాయనే చెప్పవచ్చు.

Related Posts
ఏపీ సర్కార్ కు కేంద్రం సూచనా..
polavaram

పోలవరం మెయిన్ డ్యాం పనులకు కేంద్రం రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా చెల్లించడంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టు కంపెనీలు మేఘా, బావర్లను Read more

మరికాసేపట్లో ఏపీ క్యాబినెట్ భేటీ
ap cabinet meeting 1

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్తపై పన్ను రద్దు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. Read more

రాష్ట్రంలో తొలి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు
The first case of Guillain Barre syndrome has been registered in the state

హైదరాబాద్‌: కొన్నిరోజులుగా మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్‌ బారే సిండ్రోల్‌ హైదరాబాద్‌కూ వచ్చేసింది. సిద్దిపేటకు చెందిన ఓ మహిళలకు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితురాలు ఓ ప్రైవేటు Read more

పింఛన్ల కోసం రూ.12,508 కోట్ల ఖర్చు – సీఎం చంద్రబాబు
cm chandrababu pension 1

అధికారం చేపట్టిన 110 రోజుల్లో పింఛన్ల కోసం కూటమి ప్రభుత్వం రూ.12,508 కోట్లు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. '1వ తేదీనే 98% మంది లబ్ధిదారులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *