Sujana Chowdary: లండన్‌లో ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్రగాయం

Sujana Chowdary: లండన్‌లో ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్రగాయం

సీనియర్ పొలిటీషియన్, విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి విదేశీ పర్యటనలో ప్రమాదం చోటు చేసుకుంది.అక్కడున్న ఓ సూపర్ మార్కెట్‌లో కిందపడిపోయినట్లు తెలుస్తోంది. సుజనా చౌదరి కుడి భుజానికి తీవ్ర గాయం కాగా ఎముక విరిగిపోయిందని చెబుతున్నారు. ఈ క్రమంలో సుజనా చౌదరిని సర్జరీ కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుుతన్నారు. ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చబోతున్నట్లు సమాచారం అక్కడ సర్జరీ చేసే అవకాశం ఉందంటున్నారు. సుజనా చౌదరికి తీవ్ర గాయమైనట్లు తెలియడంతో బీజేపీ నేతలు ఆరా తీస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి

Advertisements

వివరాలు

సుజనా చౌదరి ఈ నెల 2న విజయవాడలోనే ఉన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు హాజరయ్యారు. ఆయన గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం కూడా పలికారు. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి నాంది పలుకుతున్న ఈ శుభ వేళ ప్రారంభోత్సవ వేడుకకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని గన్నవరం విమానాశ్రయంలో హృదయపూర్వకంగా స్వాగతించటం చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆయన లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంతలోనే అక్కడ గాయం కావడంతో హైదరాబాద్‌కు తరలిస్తున్నారట.

ఎన్నికల

సుజనా చౌదరి వ్యాపారవేత్తగా ఉన్నారు ఆ తర్వాత ఆయన తెలుగు దేశం పార్టీలో చేరారు. సుజనా చౌదరి 2010లో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. సుజనా చౌదరి 2014 ఎన్డీఏ ప్రభుత్వంలో సైన్స్, టెక్నాలజీ , సహాయ మంత్రిగా నియమితులయ్యారు. ఆ తర్వాత టీడీపీ పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత సుజనా చౌదరి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగారు. అయితే సుజనా చౌదరి 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి 47,032 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.

Read Also: Scheme: కలలకు రెక్కలు పథకం గురించి తెలుసా!

Related Posts
వ్యవసాయ బడ్జెట్ లో మళ్ళీ సూక్ష్మపోషకాల పంపిణీ
వ్యవసాయ బడ్జెట్ లో మళ్ళీ సూక్ష్మపోషకాల పంపిణీ

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం (ఫిబ్రవరి 28) ప్రవేశపెట్టింది. రూ.3.22 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. Read more

Nara Lokesh: అభివృద్ధి వికేంద్రీకరణమే ల‌క్ష్యంగా ముందుకు వెళ్తున్నామ‌న్న మంత్రి లోకేశ్‌
lokesh

యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఇండియాస్పోరా ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూలమైన Read more

Guntur: సిఐ నా వాడంటూ కొట్టుకున్న ఇద్దరు మహిళలు..ఎక్కడంటే?
Guntur: సిఐ నా వాడంటూ కొట్టుకున్న ఇద్దరు మహిళలు..ఎక్కడంటే?

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటన స్థానికంగా మరియు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు ఒక సర్కిల్ Read more

తెలుగు రాష్ట్రాలకు రికార్డు స్థాయిలో రైల్వే బడ్జెట్
తెలుగు రాష్ట్రాలకు రికార్డు స్థాయిలో రైల్వే బడ్జెట్

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలకు భారీ స్థాయిలో రైల్వే బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×