సీనియర్ పొలిటీషియన్, విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి విదేశీ పర్యటనలో ప్రమాదం చోటు చేసుకుంది.అక్కడున్న ఓ సూపర్ మార్కెట్లో కిందపడిపోయినట్లు తెలుస్తోంది. సుజనా చౌదరి కుడి భుజానికి తీవ్ర గాయం కాగా ఎముక విరిగిపోయిందని చెబుతున్నారు. ఈ క్రమంలో సుజనా చౌదరిని సర్జరీ కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుుతన్నారు. ఆయన్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చబోతున్నట్లు సమాచారం అక్కడ సర్జరీ చేసే అవకాశం ఉందంటున్నారు. సుజనా చౌదరికి తీవ్ర గాయమైనట్లు తెలియడంతో బీజేపీ నేతలు ఆరా తీస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి
వివరాలు
సుజనా చౌదరి ఈ నెల 2న విజయవాడలోనే ఉన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు హాజరయ్యారు. ఆయన గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం కూడా పలికారు. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి నాంది పలుకుతున్న ఈ శుభ వేళ ప్రారంభోత్సవ వేడుకకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని గన్నవరం విమానాశ్రయంలో హృదయపూర్వకంగా స్వాగతించటం చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆయన లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంతలోనే అక్కడ గాయం కావడంతో హైదరాబాద్కు తరలిస్తున్నారట.
ఎన్నికల
సుజనా చౌదరి వ్యాపారవేత్తగా ఉన్నారు ఆ తర్వాత ఆయన తెలుగు దేశం పార్టీలో చేరారు. సుజనా చౌదరి 2010లో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. సుజనా చౌదరి 2014 ఎన్డీఏ ప్రభుత్వంలో సైన్స్, టెక్నాలజీ , సహాయ మంత్రిగా నియమితులయ్యారు. ఆ తర్వాత టీడీపీ పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత సుజనా చౌదరి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగారు. అయితే సుజనా చౌదరి 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి 47,032 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.
Read Also: Scheme: కలలకు రెక్కలు పథకం గురించి తెలుసా!