సీఎం రేవంత్ పై రాజాసింగ్ ప్రశంసలు

సీఎం రేవంత్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు బాగున్నాయని అభినందించారు. ‘పోలీసులు, మున్సిపల్ సిబ్బంది పనితీరు బాగుంది. సీఎం రేవంత్ రెడ్డి ఉత్సవాల ఏర్పాట్ల నుంచి నిమజ్జనం వరకు అన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షించారు.

గతంలో ఏ సీఎం చేయని విధంగా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడం సంతోషకరం. రేవంత్ ధర్మం తెలిసినవాడు’ అని వ్యాఖ్యానించారు. అలాగే.. ఖైరతాబాద్ మహాగణపతి మండపాన్ని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారని.. తొలిపూజ కూడా చేసినట్టుగా రాజాసింగ్ గుర్తు చేశారు. అయితే.. ఎండ కారణంగా నిమజ్జనాలు కొంత ఆలస్యంగా జరిగాయని.. కానీ మిగతా అన్ని ఏర్పాట్లు, వ్యవస్థల పనితీరు చాలా బాగున్నాయని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.