హైదరాబాద్ లో ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అందాల ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 110కి పైగా దేశాల నుంచి వచ్చిన ప్రపంచ సుందరీమణులు ఈ అంతర్జాతీయ వేడుకలో పాల్గొంటున్నారు.ఈ వేడుకలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మిస్ ఇండియా గా ఎంపికైన ఆమె, విశ్వసుందరి కిరీటం కోసం పోటీపడుతుంది.ప్రారంభోత్సవం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సాగింది.

“జయ జయ హే తెలంగాణ” రాష్ట్ర గీతంతో వేడుక మొదలైంది.250 మంది కళాకారులు కలిసి ప్రదర్శించిన పేరిణి నృత్యం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది.విభిన్న దేశాల నుండి వచ్చిన సుందరీమణులు తమ సాంస్కృతిక వస్త్రధారణలో ర్యాంప్పై నడుస్తూ గ్లామర్ కి నూతన అర్థం ఇచ్చారు. తెలంగాణ చేతి నేస్తాలు, కళల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.

కె. రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ CEO జూలియా మోర్లే, 2024 విజేత క్రిస్టినా పిస్కోవా వంటి ప్రముఖులు హాజరయ్యారు.ఈ కార్యక్రమం తెలంగాణను ప్రపంచ పటముపై మరింత ముందుకు నెట్టింది.పోటీదారుల కోసం ఏర్పాటు చేసిన యాదాద్రి, రామప్ప దేవాలయాలు, పోచంపల్లి వంటి పర్యాటక ప్రదేశాల సందర్శన కార్యక్రమాలు, రాష్ట్ర సంస్కృతిని పరిచయం చేశాయి.మిస్ ఇండియా నందిని గుప్తా భారత మహిళా శక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఆమె అనుభవం, ఆత్మవిశ్వాసం భారత గర్వంగా నిలుస్తోంది.మిస్ వరల్డ్ టైటిల్ కోసం ఆమె పోరాటం ప్రతి భారతీయుడికి గర్వకారణం.మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ గ ఈ నెల 31న హిట్ఎక్స్ వేదికగా జరగనుంది. ప్రపంచం మొత్తం ఈ వేడుకను ఉత్సాహంగా తిలకించనుంది. ఇది కేవలం అందాల పోటీ మాత్రమే కాదు – తెలంగాణ సంస్కృతి, భారతీయ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదిక కూడా.
Read Also : India : అయినా పాక్ ను నమ్మొద్దంటున్న నేతలు