ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు

ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు

ర్యాగింగ్ పేరుతో జూనియర్ల పట్ల సీనియర్ల అత్యంత క్రూరంగా వ్యవహరించారు. వారిని నగ్నంగా మార్చి.. ప్రయివేట్ పార్ట్స్‌కు డంబెల్స్ వేలాడదీసి, జామెట్రీ బాక్సులోని కంపాస్‌తో పొడిచి పైశాచిక ఆనందం అనుభవించారు. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా మూడు నెలల పాటు వికృత చర్యలతో జూనియర్లను హింసించి నరకం చూపించారు. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసిన అత్యంత భయానక ఈ ఘటన కేరళలోని ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి దాష్టీకం బయటపడింది.

విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు
కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో మొదటి ఏడాది విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో హింసించిన ఐదుగురు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువనంతపురానికి చెందిన జూనియర్ విద్యార్థులు కొట్టాయం గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత నవంబరు నుంచి సీనియర్ల తమను చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. బలవంతంగా బట్టలు విప్పదీయించి, మర్మాంగాలకు డంబెల్స్ కట్టి వికృత ఆనందం పొందారని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు

యావత్ దేశాన్ని కుదిపేసిన సంఘటన

గత నెల కేరళలో 15 ఏళ్ల మిహిర్ అహ్మద్ ఆత్మహత్య యావత్ దేశాన్ని కుదిపేసింది. తాము ఉంటోన్న అపార్ట్‌మెంట్ భవనం 26వ అంతస్తులోని ఫైర్‌ ఎగ్జిట్‌ విండో నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఆ బాలుడు ప్రాణాలు పోవడానికి తోటి విద్యార్థుల ర్యాగింగ్ కారణం. తాజాగా, కేరళలో అలాంటి మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. జూనియర్లపై సీనియర్ల దాష్టీకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మద్యం కోసం జూనియర్ల నుంచి డబ్బులు

వారి క్రూరత్వం అక్కడితో ఆగలేదు. జామెట్రీ బాక్సులో కాంపాస్ సహా పదునైన వస్తువులతోనూ రక్తం వచ్చేలా గుచ్చి ఆయ గాయాలకు లోషన్ రాసి హింసించారు. బాధితులు బాధతో కేకలు వేస్తుంటే, లోషన్‌ను బలవంతంగా వారి నోటిలోకి పూసేవారు. ఈ దుశ్చర్యలను వీడియో తీసి, ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. ప్రతి ఆదివారం మద్యం పార్టీల కోసం జూనియర్ల నుంచి డబ్బులు లాక్కునేవారు. ఎవరైనా ఎదురుతిరిగితే దారుణంగా కొట్టేవారు. వారి ఆగడాలను తట్టుకోలేకపోయిన ఓ విద్యార్థి తన తండ్రికి చెప్పడంతో ఆయన సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మూడు నెలల పాటు వాటి ఆగడాలను మౌనంగా భరించిన విద్యార్థులు.. శ్రుతిమించడంతో చివరకు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో యాంటీ ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదుచేసి.. ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న నిందితులు.. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు.

Related Posts
చంపేస్తానని బెదిరింపులు: స్వామి అవిముక్తేశ్వరానంద్
చంపేస్తానని బెదిరింపులు: స్వామి అవిముక్తేశ్వరానంద్

మహా కుంభమేళా తొక్కిసలాటను నిర్వహించడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను విమర్శించిన తర్వాత తనకు హత్య బెదిరింపులు వచ్చాయని శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ అన్నారు. ప్రభుత్వ దుర్వినియోగానికి వ్యతిరేకంగా Read more

అమెరికా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీ..!
Prime Minister Modi is going to visit America.

వాషింగ్ట‌న్‌: ప్ర‌ధాని మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనున్న సమాచారం. ఫిబ్ర‌వ‌రిలో మోడీ వైట్‌హౌజ్‌ను విజిట్ చేయ‌నున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. దేశాధ్య‌క్షుడిగా రెండో సారి Read more

తెలంగాణ భవిష్యత్తులో గెలుస్తాం: కిషన్ రెడ్డి
kishan reddy

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటుతోంది. 48 స్థానాల్లో ఆధిక్యతతో ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. పలువురు ఆప్ కీలక నేతలు ఓటమి బాటలో Read more

CricketNews :పంజాబ్ కింగ్స్ కి బిగ్ షాక్!
CricketNews :పంజాబ్ కింగ్స్ కి బిగ్ షాక్!

పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025లో తమ తొలి మ్యాచ్‌ను మార్చి 25న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో Read more