ponguleti indiramma

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన లబ్ధిదారులకు ఇది అందించాలనే ప్రభుత్వ విధానమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రెవెన్యూ వ్యవస్థ, సర్వేయర్ల నియామకంపై సమీక్ష నిర్వహించారు.

Advertisements

ఈ సమావేశంలో ఇండ్లకు అర్హులైన లబ్ధిదారుల నివాస స్థల పరిస్థితుల ప్రకారం రెండు జాబితాలను గ్రామసభల్లో ఉంచాలని మంత్రి అధికారులకు సూచించారు. దశల వారీగా ఇండ్ల నిర్మాణం చేపట్టి, ప్రతి అర్హుడికి ఇండ్లు అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉన్న 274 ఇంజనీర్లు అన్ని పరిశీలిస్తున్నప్పటికీ, అదనంగా 400 మంది ఇంజనీర్లు అవసరమని అధికారులు తెలిపారు. ఇతర ప్రభుత్వ విభాగాల ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా ఉపయోగించే అవకాశాలపై చర్చ జరిగిందని , ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని, ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమించేందుకు వీఆర్వో, వీఆర్‌ఏల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి పరీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి విధివిధానాలను త్వరగా రూపొందించి, పారదర్శకతతో నియామక ప్రక్రియ చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం ఉన్న 450 మంది సర్వేయర్లకు అదనంగా 1000 మంది అవసరమని పేర్కొంటూ, ఈ నియామకాలు నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Related Posts
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి కన్నుమూత
RajendraPrasad Gayatri

హైదరాబాద్‌: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం.. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.. Read more

Traffic Police : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కఠిన నిర్ణయం – మైనర్ల డ్రైవింగ్‌కు చెక్!
Traffic Police హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కఠిన నిర్ణయం – మైనర్ల డ్రైవింగ్‌కు చెక్!

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.ప్రత్యేకంగా మైనర్ల చేత వాహనాల నడిపింపును నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు.ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య Read more

Pakistanis : పాకిస్థానీలు రేపటిలోగా వెళ్లిపోవాలి – ఏపీ డీజీపీ
AP DGP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాకిస్థాన్ జాతీయులు తక్షణమే దేశాన్ని విడిచి తమ స్వదేశానికి వెళ్లిపోవాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కఠినంగా హెచ్చరించారు. రేపటి తర్వాత ఏపీలో ఎవైనా Read more

బండి సంజయ్ అలా అనలేదు – TBJP
Bandi sanjay protest at ashok nagar after meet group 1 aspirants

తెలంగాణ బీజేపీ (TBJP) బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపించింది. TBJP ప్రకారం, బీఆర్ఎస్ బండి సంజయ్ మాటలను Read more

Advertisements
×