Minister Uttam Kumar warning to party MLAs and MLCs

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ వార్నింగ్..

హైదరాబాద్‌ : బీసీ కులగణనపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కోసం రేపు సీఎం రేవంత్‌తో సమావేశం కానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజల అపోహలు తొలగించడమే తమ లక్ష్యమని చెప్పారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర కులగణనపై అనవసర రాద్ధాంతం చేయొద్దన్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

image

స్వాతంత్య్రం తర్వాత ఇంత శాస్త్రీయంగా, లాజికల్ గా దేశంలోని ఏ రాష్ట్రంలో కుల గణన జరగలేదు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండవద్దని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వివరణ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అన్ని కులాలకు సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే జరిగింది. సర్వే పై ప్రజలు ఎవరికి ఇందులో అపోహలు అవసరం లేదన్నారు.

మొదట సమగ్ర కుటుంబ సర్వే తో పోల్చుకున్నారు.. అది పబ్లిక్ డొమైన్ లో లేని డాక్యుమెంట్. ఎస్సీ వర్గీకరణ కూడా 2011 ను ఆధారంగా చేసుకొని చేసిందే. వ్యక్తిగత వివరాలు కాకుండా.. రేపు ఎల్లుండి లోగా పబ్లిక్ డొమైన్ లో కులాల వారిగా, ఉప కులాల వివరాలను జిల్లాల వారిగా పెడతాం. సర్వే పై అపోహలు,అనుమానాలు ఉన్న కుల సంఘాల నేతలను పిలిచి.. చర్చించి నివృత్తి ఇస్తాం. కుల గణన సర్వే నివేదిక ఆధారంగా సంక్షేమం పథకాల రూపకల్పన కోసం ఉపయోగిస్తాం అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

Related Posts
అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం
అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం

ఏపీ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) బహిష్కరణకు దిగింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో, పార్టీ అసెంబ్లీకి Read more

నాంపల్లి కోర్టుకు హాజరైన ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి
AICC in charge Deepadas Munshi attended the Nampally court

హైదరాబాద్‌: నేడు నాంపల్లి క్రిమినల్‌ కోర్టుకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి హాజరయ్యారు. బీజేపీ నేత ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఆమె పరువునష్టం కేసు వేశారు. Read more

మరోసారి సాంపిట్రోడా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు
Once again Sam Pitroda's controversial comments

చైనా మ‌న శత్రువు కాదు.. సామ్ పిట్రోడా. న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఓవ‌ర్‌సీస్ యూనిట్ అధినేత సామ్ పిట్రోడా మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. Read more

నితీశ్ కుమార్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం
Nitish Kumar Reddy received

టీమ్ ఇండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని స్వస్థలానికి చేరుకున్న ఆయనకు Read more