tummala runamfi

డిసెంబర్ 9 లోగా రుణమాఫీ పూర్తి చేస్తాం అంటున్న మంత్రి తుమ్మల

ఈరోజు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రుణమాఫీ కూడా ఒకటి. ఎన్నో ఏళ్లుగా రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పడం తో..కాంగ్రెస్ పార్టీ ఆ మాట నిలబెట్టుకుంటుందనే నమ్మకంతో రైతులు కాంగ్రెస్ కు జై కొట్టారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆగస్టు 15 లోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. కానీ రుణమాఫీ మాత్రం పూర్తి స్థాయిలో చేయలేకపోయింది. కేవలం 25% మందికి మాత్రమే చేసి..మిగతా వారికీ చేయలేదు. దీంతో రుణమాఫీ జరగని రైతులంతా ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో మంత్రులు ఎప్పటికప్పుడు రుణమాఫీ తప్పకుండ చేస్తామని మాట ఇస్తూ వస్తున్నారు. తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ..డిసెంబర్ 9 లోగా ప్రతి రైతుకు రుణమాఫీ పూర్తి చేసి.. ఆ తర్వాత రైతు భరోసా రూ.7500 రైతుల అకౌంట్లోకి జమ చేస్తామన్నారు. హాలియా మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా.. బుధవారం లక్ష్మీనరసింహ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9 నాటికి రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సన్నాలకు రూ.500 బోనస్ అందజేస్తామని తెలిపారు. నల్లగొండ జిల్లాలో రైతులు పామాయిల్ సాగు గణనీయంగా పెంచాలని, రైతుల సౌకర్యార్థం పామాయిల్ ఉత్పత్తి కేంద్రాన్ని నల్లగొండ జిల్లాలో సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు కనీస సౌకర్యాలు అందించేందుకు మార్కెట్ యార్డులు కృషి చేయాలని కోరారు.

Related Posts
జాతీయ దత్తత దినోత్సవం!
national adoption day

ప్రతి సంవత్సరం నవంబర్ 18న జాతీయ దత్తత దినోత్సవం (National Adoption Day) గా జరుపుకుంటాం. ఈ ప్రత్యేకమైన రోజు, పిల్లల్ని ప్రేమభరిత కుటుంబాల్లో అంగీకరించి వారికి Read more

పుష్ప 2 తొక్కిసలాటపై ఒవైసీ వ్యాఖ్యలు
పుష్ప 2 తొక్కిసలాటపై ఒవైసీ వ్యాఖ్యలు

అల్లు అర్జున్‌ తొక్కిసలాట జరిగిన సినిమా చూసాడు: అక్బరుద్దీన్ ఒవైసీ AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, హైదరాబాద్‌లో తన బ్లాక్‌బస్టర్ చిత్రం 'పుష్ప 2: ది రూల్' Read more

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు
Yadagirigutta Devasthanam Board on the lines of TTD

హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు Read more

పరువు నష్టం కేసు..రాహుల్ గాంధీకి బెయిల్
Defamation case..Bail for Rahul Gandhi

న్యూఢిల్లీ: విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బిగ్ రిలీఫ్ దక్కింది. పరువు నష్టం కేసులో పుణె కోర్టు ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. 2023 Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *