మెగాస్టార్ చిరంజీవి – కేసీఆర్ లను కలిసిన ఏపీ మంత్రి రోజా

ఏపీ మంత్రి రోజా..మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లను కుటుంబ సమేతంగా వెళ్లి కలిశారు. చిరంజీవి, ఆయన భార్య సురేఖ… రోజాను, ఆమె భర్త సెల్వమణిని, పిల్లలను సాదరంగా ఆహ్వానించారు. ఆచార్య విడుదల సందర్భంగా రోజా శుభాకాంక్షలు తెలుపగా, సినీ పరిశ్రమ నుంచి వెళ్లి ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన రోజాను చిరంజీవి దంపతులు ఈ సందర్భంగా అభినందించారు.

ఈ సందర్భంగా రోజాకు శాలువా కప్పి సన్మానించారు. అంతకు ముందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు రోజా. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. మంత్రి రోజాకు సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. రోజాను కేసీఆర్‌ దంపతులు సంప్రదాయబద్దంగా బొట్టుపెట్టి సత్కరించారు. ఇక నగరి మ్మెల్యే గా ఉన్న రోజా..తాజాగా ఏపీ కొత్త మంత్రి వర్గం లో ఏపీ క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం శాఖ మంత్రిగా ఎంపికయ్యారు.