Minister Nadendla conducts surprise inspection at Civil Supplies Department store

Nadendla Manohar : పౌరసరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ

Minister Nadendla Manohar : ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఉన్న పౌరసరఫరాల శాఖ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ అందుబాటులో ఉంచిన బియ్యం నాణ్యతను పరిశీలించారు. బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖ పేరుతో ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఆ దుకాణాన్ని సీజ్ చేశారు.

Advertisements
పౌరసరఫరాల శాఖ దుకాణంలో మంత్రి

నెల రోజుల్లో ప్రభుత్వ దుకాణం

ఏపీ భవన్ లో నెల రోజుల్లో ప్రభుత్వ దుకాణం ఏర్పాటు చేస్తామని మంత్రి అక్కడిక్కడే ప్రకటించారు. ఇకపై ఏపీ భవన్ లోని దుకాణం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోనే నడుస్తుందని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో మంత్రి నాదెండ్లతో పాటు పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు.

వెంటనే షాపును సీజ్ చేయాలని అధికారులకు ఆదేశం

అమ్మే బియ్యం లో నాణ్యత లేదు. 26 కేజీల బియ్యం బస్తా 25 కేజీలు మాత్రమే ఉంది. వేయింగ్ మిషన్ సైతం సరిగా పనిచేయడం లేదన్నారు. 26 కేజీల బియ్యం బస్తాను మంత్రి నాదెండ్ల మనోహర్ చెక్ చేశారు.బియ్యంలో నూకల శాతం ఎక్కువగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ గమనించారు. ఈ సందర్భంగా నెలలోగా ఏపీ పౌర సరఫరాల శాఖ తరపున రేషన్ స్టోర్ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం తెలిపారు. నాణ్యమైన బియ్యంతో పాటు, సరుకులను అందిస్తాం అని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Read Also: అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు..పురందేశ్వరి హర్షం

Related Posts
CLP Meeting : నేడు కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం
revanth clp

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం నేడు ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ప్రభుత్వ పథకాల Read more

Sudheer Reddy : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై కేసు నమోదు
Case registered against MLA Sudheer Reddy

Sudheer Reddy : రంగారెడ్డిలోని ఎల్బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. తనను దూషించారని హస్తినాపురం కార్పొరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు Read more

తమిళనాడులో దారుణ ఘటన..విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్‌ రేప్‌
Atrocious incident in Tamil Nadu..A student was raped by a gang of teachers

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారారు. ఓ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. Read more

Telangana: తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త
Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ – ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త! గతంలో నిలిచిపోయిన ఉద్యోగ నియామక ప్రక్రియలు మళ్లీ ప్రారంభమయ్యే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎస్సీ వర్గీకరణ చట్టంపై స్పష్టత రావడంతో, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×