అరకట్టపై కీలక పత్రాలను తగలబెట్టారు..

మరోసారి ప్రభుత్వ కీలక పత్రాలు బయటపడ్డాయి. గత ప్రభుత్వంలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి అధికార పార్టీ సమీక్షలు జరుపుతున్న వేళ..విజయవాడలో ప్రభుత్వ ఫైల్స్ దహనం కావడం ఇప్పుడు చర్చగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి విజయవాడ అరకట్ట ఫై దహనం చేస్తుండగా..టిడిపి శ్రేణులు చూసి వారిని పట్టుకున్నారు. గత రాత్రి స్థానికంగా ఇంకా ఎక్కడైనా ఎవరైనా ఫైల్స్ దహనం వంటి చర్యలకు పాల్పడ్డారా అన్న విషయాలపై అన్న వివరాలు రాబట్టేందుకు ఇంటిలిజెన్స్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.

గోనె సంచి మూటల్లో ఫైల్స్ తీసుకువచ్చి దగ్ధం చేసేందుకు ప్రయత్నం చేసినట్టు అధికారులు నిర్ధారణ చేసుకున్నారు. హార్డ్ డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మైనింగ్ శాఖ ఫైల్స్ దగ్ధం చేసిన ఎవరినీ వదలబోమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో కొంత మంది అధికారుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు.