శ్రీలంకలో సైనిక హెలికాప్టర్ (Helicopter)కూలింది. ఓ రిజర్వాయర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఆరు మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. శిక్షణ విన్యాసాల సమయంలో హెలికాప్టర్ కూలినట్లు తెలుస్తోంది.

శ్రీలంకలో (Sri Lanka) సైనిక హెలికాప్టర్ కూలింది(Helicopter crash). ఓ రిజర్వాయర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఆరు మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మడురు ఓయా అనే సెంట్రల్ ప్రాంతంలో శ్రీలంక ఎయిర్ ఫోర్స్ దళానికి చెందిన బెల్ 212 హెలికాప్టర్ కూలినట్లు రక్షణశాఖ పేర్కొన్నది. ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ బ్రిగేడ్ పాసింగ్ ఔట్ పరేడ్లో ప్రదర్శనకు వెళ్తున్న సమయంలో ఈ హెలికాప్టర్ కూలినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతిచెందిన వారిలో ఇద్దరు ఎయిర్ ఫోర్స్, నలుగురు ప్రత్యేక దళ సైనికాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై విచారణ చేపట్టేందుకు 9 మంది సభ్యులతో శ్రీలంక వైమానిక దళం ఓ ప్యానెల్ను ఏర్పాటు చేసింది.
శిక్షణ సమయంలో ప్రమాదం
ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారు హెలికాప్టర్ లో శిక్షణ విన్యాసాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటనపై శ్రీలంక ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, పూర్తి స్థాయిలో దర్యాప్తుని ప్రకటించారు.
హెలికాప్టర్ శిక్షణ విన్యాసాలు నిర్వహిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తిందా? లేక వాతావరణ ప్రభావమా అన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also : Pakistan : పాకిస్తాన్ విరుచుకుపడడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితి