Migration of 75 Indians from Syria

సిరియా నుంచి 75 మంది భార‌తీయుల త‌రలింపు

న్యూఢిల్లీ: సిరియాలో నెలకొన్న పరిస్థితుల మధ్య అక్కడున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా 75 మంది భారత పౌరులను డమాస్కస్‌ నుంచి లెబనాన్‌కు సురక్షితంగా తీసుకొచ్చింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 75 మంది భారతీయుల్లో 44 మంది జమ్మూకశ్మీర్‌కు చెందిన జైరిన్‌ (యాత్రికులు)లు ఉన్నారని మంత్రిత్వశాఖ పేర్కొంది.

వారంతా సిరియా సరిహద్దులు దాటి క్షేమంగా లెబనాన్‌కు చేరుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్కడ నుంచి వారంతా వాణిజ్య విమానాల ద్వారా లెబనాన్‌ నుంచి త్వరలోనే స్వదేశానికి చేరుకోనున్నట్లు తెలిపింది. ఇంకా అనేక మంది భారతీయులు సిరియాలో ఉన్నారని వెల్లడించింది. వారంతా డమాస్కస్‌లోని రాయబార కార్యాలయంతో +963 993385973 వాట్సప్‌లో, hoc.damascus@mea.gov.in ఇ-మెయిల్‌ ద్వారా టచ్‌లో ఉండాలని పేర్కొంది.

కాగా, సాయుధ తిరుగుబాటుదారులు సిరియా రాజధాని డమాస్కస్‌తో సహా పలు నగరాలను ఆక్రమించుకున్నారు. దీంతో అసద్‌ తన కుటుంబంతో సహా రష్యాకు శరణార్థిగా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు. అధికార బదిలీపై తిరుగుబాటుదారులతో చర్చలు జరిపాకే అసద్‌ సిరియాను వీడారని రష్యా ప్రభుత్వం తెలిపింది. ఇక, అసద్‌ సిరియాను వీడిన వెంటనే నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిందని రెబల్స్ సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ రెబల్స్‌ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అస‌ద్ కుటుంబం సుమారు అయిదు ద‌శాబ్ధాల నుంచి సిరియాను పాలిస్తున్న‌ది. అయితే రెబ‌ల్స్ తిరుగుబాటుతో.. ఆదివారం దేశాన్ని విడిచి వెళ్లారు.

Related Posts
రైతు మహా ధర్నాకు అనుమతించిన హైకోర్టు
రైతు మహా ధర్నాకు అనుమతించిన హైకోర్టు

మొదటగా, జనవరి 20న రైతు మహా ధర్నాను నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రణాళిక చేసింది. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఈ ధర్నాకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో, బీఆర్ఎస్ Read more

ఇరాన్ తో సంబంధాలపై ట్రంప్ కొత్త దృష్టి
musk iravani

ప్రముఖ బిలియనియర్ ఎలాన్ మస్క్, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఇరాన్-అమెరికా సంబంధాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. మస్క్ ఇటీవల ఇరాన్ యునైటెడ్ Read more

ఢిల్లీలో AQI 273కి చేరింది, అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన..
delhi aqi

న్యూ ఢిల్లీ వాయు నాణ్యత సూచిక (AQI) సోమవారం ఉదయం 8 గంటల సమయంలో 273 వద్ద నమోదయ్యింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) ప్రకారం Read more

అనవసర వివాదాల జోలికి వెళ్లవద్దని పవన్ సూచన

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు హృదయపూర్వక సందేశం ఇచ్చారు. బహిరంగ లేఖ ద్వారా పవన్ కల్యాణ్ పార్టీ Read more