Pahalgam: ఇవాళ క్రికెట్ లో నల్ల బ్యాడ్జ్‌లు ధరించి ఆడనున్న ఎమ్ఐ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ జట్లు

Pahalgam: ఇవాళ క్రికెట్ లో నల్ల బ్యాడ్జ్‌లు ధరించి ఆడనున్న ఎమ్ఐ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ జట్లు

కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా భారత్ ఉలిక్కిపడింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స‌మాచారం.దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ప్రకటించింది.2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)తో సహా వివిధ పార్టీలు బుధవారం బంద్, నిరసనకు పిలుపునిచ్చాయి.దీంతో జమ్మూ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisements

ప్లేఆఫ్‌ రేసు

ఈ నేపథ్యం లో పహల్గాం ఉగ్రదాడిని భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు ఖండించారు. బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే,వరుసగా నాలుగు ఓటముల అనంతరం పంజాబ్‌ కింగ్స్‌పై విజయంతో గాడినపడ్డట్లే కనిపించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముంబయి ఇండియన్స్‌ చేతిపై ఓటమితో మళ్లీ మొదటికొచ్చింది. దీంతో ఐపీఎల్‌ 2025లో సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్‌ రేసు అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఇదే సమయంలో మరోవైపు ఓటములతో ప్రారంభించిన ముంబై ఇప్పుడు గెలుపు బాట పట్టింది. తొలి ఐదు ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయంతో అభిమానుల్ని నిరాశపరిచిన ముంబై వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్‌ విక్టరీ అందుకుంది.

 Pahalgam: ఇవాళ క్రికెట్ లో  నల్ల బ్యాడ్జ్‌లు ధరించి ఆడనున్న ఎమ్ఐ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ జట్లు

నలుపు బాండ్లు

రెండు జట్లు తాజాగా ఉప్పల్ స్టేడియం వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. సాధారణంగా మ్యాచ్ అంటే బాణాసంచా కాల్చడం, చీర్ లీడర్స్ ఆటపాట ఉంటాయన్న సంగతి తెలిసిందే. కానీ ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచులో ఇవి ఉండట్లేదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మ్యాచ్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మ్యాచులో పాల్గొనే ఆటగాళ్లు, అంపైర్లు కూడా నలుపు బాండ్లు ధరించి, ఘటనలో మరణించినవారికి సంతాపం తెలపనున్నారు. ఒక నిమిషం పాటు మౌనం పాటించి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించనున్నారు.కాగా, పహల్గాం ఉగ్రదాడి మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులను చుట్టుముట్టి అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటన అనంతరం ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయారు. వీరి కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.

Read Also: Pahalgam: పహల్గాం ఉగ్ర‌దాడి స్పందించిన క్రికెటర్లు

Related Posts
Vaibhav Suryavanshi: తన బ్యాటింగ్ తో అందర్నీ ఆకట్టుకుంటున్న వైభవ్ సూర్యవంశీ
Vaibhav Suryavanshi: తన బ్యాటింగ్ తో అందర్నీ ఆకట్టుకుంటున్న వైభవ్ సూర్యవంశీ

ఐపీఎల్ 2025 సీజన్‌లో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.వైభవ్ సూర్యవంశీ తన ఐపీఎల్ కెరీర్‌ను శక్తివంతమైన Read more

PC Mohan : బెంగళూరులో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలన్న ఎంపీ
PC Mohan బెంగళూరులో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలన్న ఎంపీ

భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు నగరం ఇప్పుడు వానల వల్ల వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగర జీవన పూర్తిగా నిలిచిపోయింది. రోడ్లు Read more

Student Arrest: అమెరికాలో స్టూడెంట్ అరెస్టు: చర్చనీయాంశంగా మారిన ఘటన
అమెరికాలో స్టూడెంట్ అరెస్టు: చర్చనీయాంశంగా మారిన ఘటన

విద్యార్థులపై ఇమిగ్రేషన్ కఠిన చర్యలుఅమెరికాలో అక్రమ వలసదారులు, వీసా గడువు ముగిసిన తర్వాత తిరిగి వెళ్లని వారిపై ఇమిగ్రేషన్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మసాచుసెట్స్‌లో Read more

కోచింగ్ సెంటర్లకు కొత్త నియమాలు..
images 1 1

ప్రభుత్వం కోచింగ్ పరిశ్రమల పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కోచింగ్ సెంటర్ లు తరచూ అద్భుతమైన హామీలతో విద్యార్థులను మభ్యపెడుతున్నాయి . దాని కారణంగా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×