జూన్ 24న తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా!

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు తెలిపింది. యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 24న హుస్నాబాద్ వేదికగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. 60కి పైగా కంపెనీల్లో 5 వేల ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. తిరుమల గార్డెన్స్ అండ్ ఫంక్షన్ హాల్‌ లో జరిగే ఈ జాబ్ మేళాలో 18-35 ఏళ్ల వయసు గల నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించింది.

విద్యార్హతలు:

7వ తరగతి నుంచి 12వ అండర్ గ్రాడ్యూయేట్, డిప్లొమా హోల్డర్, బిఫార్మా, ఎంఫార్మా, హోటల్ మేనేజింగ్, డ్రైవర్స్, బీఇ, బిటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఎ, ఎంపిఎస్, పోస్ట్ గ్రాడ్యూయేట్ అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొంది.